పుట:Bhoojaraajiiyamu.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

161

వ్యాధుని కధ


వ.

అని యతవి నూఱడించి యవ్విప్రుండు తన కలశోదకంబున సాయంకరణీ
యంబులు దీర్చి కూర్చుండునెడ నక్కిరాతుండు రెండుదొప్పల చారబియ్యం
బును దేనెయుం దెచ్చి యిచ్చిన నవి భగదర్పితంబు చేసి యుపయోగించి
యాప్యాయనంబుగా నుదకంబు గొని కృతాచమనుండై పర్ణతల్పంబున నుప
క్రమించిన.

164


క.

'క్రూరమృగంబులు గల వీ
ఘోరాటవి, నిచట నిద్ర గూరుట గొఱ గా;
దీరును మత్సతియును బొడ
వారిన మంచెపయి నుండుఁ ' డని యెక్కించెన్.

165


వ.

ఇ ట్లెక్కించి యక్కిరాతుండు.

166


ఉ.

తా నొక విల్లు నమ్ములును దాల్చి ముదంబున నిద్ర గాచి యా
చేనికి దుష్టసత్వములు చేరక యుండ నదల్చుచుండ న
చ్చో నరుణోదయం బిగుట చూచి యొకించుక కన్ను మోడ్చె నా
లోనన యొక్క బెబ్బులి విలోలత వచ్చి వధించె నాతనిన్.

167


క.

అప్పులి గవిసిన యప్పటి
చప్పుడు విని యక్కిరాతసతి మేల్కని వా
తప్పక యొక్కశరంబునఁ
జెప్ప నరిది గాఁగ దాని జీవము గొనియెన్.

168


శా.

ఆవిప్రుండును నప్డు బిట్టులికి యత్యాకంపముం బొంది వా
పోవం జొచ్చె; లతాంగి వె న్పఱచి విప్రుం దేర్చెఁ; బద్మప్రియుం
డావార్త ల్విని వచ్చినట్లు కరసంఘాగ్రంబునం జీఁకటుల్
పోవం ద్రోచుచుఁ దోఁచె నాదిమదిశాభూమీధ్రశృంగంబునన్.

169


ఉ.

అంతఁ గిరాతకాంత వగ నందెడువిప్రునిఁ జూచి 'తండ్రి! యే
నింతకు నోచి యుండ నిది యేరికి వశ్యమె తప్పఁ ద్రోవ ని
శ్చింతత నేఁగుఁ డాతవముచేఁ గడుఁ జికెకేద రింక నైన; న
ల్లంతనె పోవుత్రోవలె యుదగ్రమహోగ్రమృగప్రకీర్ణముల్.'

170


చ.

అనిన నతండు 'నాకుఁ దగవా? యిటువంటి పరోపకారి నెం
దునుఁ బొడగాన నీతఁడు మృతుం డగు టేఁ గనుఁగొంటిఁ, జూచి యే