పుట:Bhoojaraajiiyamu.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పావకలోముని కథ

117


దేవికి లంచ మిచ్చినగతి న్సురవైరి యెఱుంగకుండ రా
జీవదళాక్షి యప్డు వయిచెం దన మైతొడవుల్ గ్రమంబునన్.

49


సీ.

అంతఁ బావకలోముఁ డట పోయి నిర్మలో
       దకపూర్ణమై యొప్పు నొక మహాత
టాకంబుఁ గని తన డప్పి యంతయుఁ బోవ
       జలపాన మొనరించి సరభసమున
నచ్ఛిద్రసరసీరుహచ్ఛదంబునఁ గొంత
       యుదకంబు నుంచి యయ్యువిద కనుచుఁ
గొనివచ్చి మున్ను డా నునిచి పోయినపోటఁ
       దరళాక్షిఁ గానక తల్లడించి


ఆ.

దెసలు కలయఁ జూచి తిరిగి వచ్చియు లతా
కుజము లరసి యెల్ల గుహలయందు
వెదకి యోలములు వివేకించి చఱులు భా
వించి గొల్లములకుఁ బంచె దృష్టి.

50


క.

ఎందును గానక తద్దయు
వందురి యెలుఁ గెత్తి పిలిచి 'వనజముఖీ! నీ
వెందున్నదానవే? యీ
చందంబునఁ బిల్వఁ బల్కఁ జనదే నీకున్.

51


చ.

ఉదకంబు ల్వెసఁ దేక యేఁ దడవుగా నున్నంతఁ గోపించి యొ
క్కదెసం దాఁగితొ? నాదు చిత్త మరయంగా నీరముల్ దూఱితో?
పొదలం బువ్వులు గోయం బోయితొ? మృగంబుల్ సంచరింపంగఁ జూ
చి దిగు ల్చొచ్చి తొలంగఁబాఱితొ? ననుం జింతింపవేలే మదిన్?'

52


వ.

అని యనేక ప్రకారంబులం బ్రలాపించి, తన యరణ్యరోదనంబునకు నొండు
గతి లేకునికింజేసి తన్నుం దా నుపశమించుకొని నా చెలికాఁడును రాఁడయ్యె
నట పోయి వానిం గూర్చుకొని కార్యాలోచనంబు సేయవలె నని యూహించి
యా రాజనందనుండు.

53


చ.

పడతుకఁ గానలే కునికిఁ బాయని నెవ్వగఁజేసి యెంతయున్
సుడివడి తాఁకుచున్ దగులుచున్ గడుదూరములందుఁ జొచ్చి పో