పుట:Bhoojaraajiiyamu.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదనరేఖ కథ

111


జలితచామరములు కలహంసములు, మణి
       ద్యుతులు రక్తాబ్జసంతతులు గాఁగ,


తే.

నెలమిఁ దత్ప్వయంవరమున కేఁగుదెంచి
యున్న రాజన్యసమితిచే నొప్పు మిగిలి
యుండె నా రాజమార్గంబు నిండుఁగొలని
భంగిఁ గలమంజులాలాపబహుల మగుచు.

12


వ.

అయ్యవసరంబున.

13


సీ

అజవక్షుఁ డొక యంత్రహంసంబుఁ దెప్పించి
       యా హంస యఱుత ననర్ఘ్యరత్న
మయమైన పదకంబు నయమునఁ గీలించి
       యొక సౌధవేదిపై నునిచి తనదు
తనయ శృంగారించి కొని వచ్చి యా పక్షి
       మీఁద నెక్కింప నా మృదులహస్త
హస్తాబ్జమునఁ దారహారంబు శోభిల్ల
       నఖిలమర్త్యులకుఁ బ్రత్యక్ష మైన


ఆ.

వాణి వోని కీరవాణిఁ బీనశ్రోణి
నలి వినీలవేణి నలరుఁబోణి
నఱ్ఱు లెత్తి చూచి రందఱుఁ దమ తమ
నయనవిస్తృతు లొగి బయలు పడఁగ.

14


క.

ఆ వేళ నమ్మహీపతు
లీవనజదళాయతాక్షి యిఁక నెవని కగున్
భావింప నతఁడ తగుఁ బో
భావజసామ్రాజ్యపట్టభద్రుఁడు గాఁగన్.

15


క.

అనువారు, నవ్వధూమణి
తనక తనక యబ్బు ననుచుఁ దత్పరులై క
న్గొనువారు, మనుజలోకం
బున కిచ్చెలువంబు క్రొత్తసొ మ్మనువారున్.

16