పుట:Bhoojaraajiiyamu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మదనరేఖ కథ

93


'విను మిదె యామ్నాయవిదుఁ డైనవిప్రుఁడు
       ధర్మప్రజార్ధమై తగినకన్య
నరసి పెండిలియాడ నరుగుచో విఘ్నంబుఁ
       గావించుపాపానఁ బోవుదాన
నప్పుడు రాకున్న' నని పల్కఁ' 'బోఁబోలు'
       ననియె నాగురుపుత్రుఁ, డట్ల పలికి


తే.

యరిగె రాజపుత్రి మరుసాయకము గుఱిఁ
దూఱ నాఁటి తిరిగి దొనకు నేఁగు
నట్లు నిర్వికారయానంబుతోఁ గీర్తి
సదన మైన తండ్రి సదనమునకు.

97


వ.

అంత నయ్యంతికిం దంత్రి యను రాజకుమారుండు వరుండై ప్రధమసంగ
మోత్సవసముత్సుకం బగు మనంబున దూతికాజనంబులం బనుప వార లచ్చె
లువం బిలువం బోయిన.

98


ఆ.

ఆనృపాలపుత్రి యాదటఁ గై సేసి
యతనుపాలి కరుగు రతియ పోలె
నరిగి యరిగి మున్ను గురుతనూజునితోడఁ
బల్కినట్టి కడిఁదిబాసఁ దలఁచి.

99


చ.

మదిఁ దలపోసి 'యాగురుకుమారునితో నలనాఁడు మత్పతిం
గదియుటకంటె మున్ను నినుఁ గానఁగ వచ్చెద నమ్ము మంటి, నీ
యదన నితండు నన్ను గవయన్ గుతుకంబునఁ బిల్వఁ బంచె నా
కదియు నవశ్య, మిప్పనియు నర్హమ, యెయ్యది యాచరింతునో.

100


సీ.

విప్రుపాలికిఁ బోయి వేగ వచ్చెద నన్న
       నృపదూతికల నాకు నిల్ప రాదు
మగనికోరిక దీర్చి మఱి వత్తు నని యేను
       జనిన నసత్యదోషంబు వచ్చు
నీపూట దప్పించి యెల్లి చూచెద [1]నని
       పతి వేడ్కఁ జెఱుచుట పాడి గాదు

  1. నన్న