పుట:Bhoojaraajiiyamu.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భోజచరిత్ర

49


భావంబునఁ బొడచూపిన
కైవడి నొకసిద్ధుఁ డుండఁగాఁ బొడగనియెన్.

136


క.

కని ప్రణమిల్లిన నాతఁడు
తనతో భాషింపకున్నఁ దాఁ దొలఁగక శం
భునిఁ బురుషభిక్ష మడుగం
జనుదెంచిన రతియపోలె సన్నిధి నుండెన్.

137


క.

ధ్యానానంతరమునఁ బర
మానందవిజృంభితాక్షుఁ డై సిద్ధుఁడు 'బా
లా! నీ వెవ్వరి దానవు?
నీ నాథుం డెన్వఁ డేల నిలిచితి విచటన్?'

138


వ.

నావుడు నాసిద్ధునకు నమ్మగువ యిట్లను 'నేను వేశ్యాధర్మంబున జరించుదాన,
నిమ్మహాదేవునకు నమస్కరింప వచ్చి యిచ్చట మిమ్ముఁ గని దండప్రణా
మంబు చేసి మీకటాక్షం బపేక్షించి యున్నదాన' ననవుడు నతండు ప్రీతుండై
చేరం బిలిచి నొసలు నిండ విభూతి పెట్టి దీవించిన 'నయ్యా! మదీయావాసంబు
నకు విచ్చేయ వలయు' నని యచ్చెలువ ప్రార్థించిన.

139


క.

'ఊరు చొర నొల్ల నేను, శి
వారాధనతత్పరుండనై నెలఁ బదినా
ళ్ళీరమ్యం బగు దేవా
గారంబున నుండువేడ్క గదిరెడు నాకున్.

140


ఉ.

బాలకి పొమ్ము' నావుడుఁ దపప్విపదాబ్జయుగంబుమీఁద నీ
లాలకజాలము ల్నెరయ నాయలికుంతల సాఁగి మ్రొక్కి క్రొ
వ్వాలినకన్మెఱుంగుల నివాళి యొనర్చి రతీశమత్తశుం
డాలము నోజ బింకపునడల్ బెడఁగొందఁగ నేఁగి భక్తితోన్.

141


క.

నాడు మొదలుకొని యాపూఁ
బోఁడి యనారతముఁ దెచ్చి భోజన మిడఁగా
నేఁడొక్కటి చనునంతకు
వాఁ డక్కడ నుండు నుచితవర్తనలమెయిన్.

142