పుట:Bharatiyanagarik018597mbp.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సేనుడను బౌద్దభిక్షువును హిందూ దేశమునుండి రావించి బౌద్దమతమును వ్యాపింపజేసెను.

(8) చంపా :- ఇయ్యది నయాం కాంబోడియాలకు తూర్పున బ్రకృత అస్సాంలో నుండినది. క్రీ. శ. 192 లో హిందువులు దీనిని నిర్మించిరి. పాణనీయ వ్యాకరణము, పురాణములు, జ్యోతిషము, పడ్డర్శనములు, ధర్మ శాస్త్రములు శైవా గమములు, హిందువుల చతు:షష్టి కళలు నీ దేశమునం దుండినవి. ఇచ్చట శైవ మతము ప్రబలుటచే శివాలయము లనేకము లుండెడివి. వాని శిదిలములు నేటికిని బరిశోధకులకు లభించుచున్నవి.

(9) మలే ద్వీపకల్పము :- ప్రాచీన హిందువులు పశ్చిమమున ఆఫ్రికా ఖండములోని మెడగాస్కర్ ద్వీపముతోడను, తూర్పున మలేద్వీప కల్పము మీదుగా జావా, సుమత్రా దీవులతోడను వ్యాపారము జేయుచుండిరి. మలే భాసలో నెన్నియో సంస్కృత పదములు గలవు. మతనైతి కార్దిక జ్యోతిష గణితాది విషయములను గూర్చి యిచ్చటివారి యభి ప్రాయములు గీర్వాణ పదములలోనే బేర్కొనబడుచున్నవి. వారి దేవతలలో నుత్తమ వర్గీయులు హిందూదేవతలు. సర్వవిదములను మలేవాసులు చిరకాలము హిందూనాగరికత ననుభవించిరి.