పుట:Bhaarata arthashaastramu (1958).pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఎనిమిదవ ప్రకరణము

ఆర్థిక మాత్సర్యముచే బుట్టు ననర్థములు

స్పర్థావిషయమైన చింతల నుపన్యసించుచో నందుచే మేలులేగావు కీళ్ళును బొరయునని వాదించితిమ. ప్రకృతమీ నికృష్టంబుల నింకను విస్తరముగ విశదీకరింతము.

క్రయ్య క్రేయ్యములు తులదూచినట్లు సరిపోయిన కష్టనష్టము లెన్నండును గలుగవు. క్రేయమనగా నమ్మకమునకువచ్చు వస్తుసముదాయము. క్రయ్య మనగా నర్థులు గొననుద్యమించిన వస్తు సముదాయము. అనగా నొకవెల ప్రకారము, అను సమయము రెండింట గూఢమని యెఱుంగునది. అర్థులకుం జాలకపోయినవారికి కష్టము. అమ్ము వారలయొద్ద విక్రయమునకుబోక శేషించి రాసులు నిలిచెనేని వీరికి నష్టము. కొందఱు శాస్త్రజ్ఞులు, ఇవి రెండును తూనిక వేసినట్లు సమత్వమందుట సర్వపక్షములకును శ్రేయస్కరంబని యెంచినవారై ఈ సమత్వంబు నొడగూర్చు విధంబులెవ్వియని రోయదొడంగిరి. వారియభిప్రాయములను గొన్నింటనిట జర్చింతము.

తమకు వలయు పదార్థములం దామే సేకరించు కాలములోను, అనుమతి నొందికాని యుత్పత్తికి ప్రారంభింపని కాలములోను గ్రయ విక్రయరాసుల సమత్వము సహజముగ సిద్ధించుననుట స్ఫుటము. ఆధునిక సమయమున జనుల యాదరణ నిరీక్షించి ఉత్పాదకులు వస్తు రచనకుం దొడంగుటంబట్టియు గ్రయ విక్రయ చక్రములు దృష్టికి మించిన వైశాల్యవంతము లగుటజేసియు నీసమత్వమసిద్ధము, అట్లగుట వీనికి దుల్యభావం బాపాదించు స్థితిగతు లున్నవా, లేవా, యనుట విచార్యము.

1. మూల్యములు ధరలు. ఇవి సమత కనుకూలించునని యను వారి మతప్రకారము:-