పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

కొవ్వుడు - భయంకరకోపాగ్ని. 21 నిచే భక్షింపఁబడియె” సని యావృత్తాంతం బంతయు విని పిచెను. గర్భ సాసమునందే సకల వేద వేదాంగ పారీణుండై యత్యంత తపశ్శక్తియ గుండై జనించిన పరాశరుఁడు జనక వధావిధానంబువిని పదహన దందహ్యసూన హృదయండై తన తపోమహత్యంబున సకల లోకములు సంహరించాడనని కమండలంబు గైకొనుచుండ వసిష్ఠుఁడు వచ్చి మనుమని వారించి యిట్లనియె.

తండ్రీ నీదుస్సాహసం బుడుగుము, నీ కొక్క యితి హాసంబు చెప్పెద విషము. కృత వీర్యుండను రాజు కలఁడు. అతఁదం భృగువంశమువారిని గురువుల గాఁ జేసికొని యనేక యజ్ఞములొ సర్చి యాయజ్ఞములయందు వారి కపరిమితము లైన ధనము లిచ్చి తృప్తి పరచెను. కృతవీర్యుఁడు స్వర్గస్టు డైన యంత నే యతని వంశస్థు లైన రాజు లందఱు నతి ధన లు బల్లి " ఓ భృగువంశ బ్రాహణులారా! కృతవీర్యుని మోసపుచ్చి మిరార్జించిన ధనంబు లెల్ల మాకు దిరిగి చెల్లింపుఁ " డని తీవ్రముగ శాసించిరి. భార్గవులు రాజు శాసనంబునకు భయపడి తమ తమ ధనకనకవస్తుజాహనాదు లను గొనిపోయి. వారికి సమర్పించు కొనుచుండిరి. కొందఱు బ్రాహణులు తమ ధనంబుల రహస్యముగఁ బాతి బెట్టియూర కుండిరి. రాజు లనుమానించి యట్టి వారి గృహముల శోధింపఁ దగ్గనంబు లెల్ల బయలుపడినవి. ఇంత సాక్షత్రియు లాగ హించి యీ భార్గవులు రాజధన వంచకులు. వీరిని