పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంవరణ చరిత్రము - పురోహిత ప్రభావము.

5


నుండియు నీయంగార పర్ణత్వమును విడిచి చిత్రరథుండను పేర సంచరించుచుందు. నేను స్త్రీలోలుండనై యుండుటచేతను నీవు బ్రహ్మచర్య వ్రతస్థుండవగుటచేతను, నీవు జయించుటయు నే నోడుటయుఁ దటస్థించినవి. మఱియొకఁ డీ యర్ధ రాత్రంబున నన్ను గెలిచి పోజాలఁడు.

గీ. పాండుపుత్ర ! నీవు బ్రహ్మచర్యస్థుండ
    వగుటఁ జేసి మన్మథార్తునన్ను
    నొడిచి తిందు రాత్రి యుద్ధంబుసేసి కా
    మోపభోగ నిరతుఁ డోటువడఁడె ?

___________

2. సంవరణ చరిత్రము - పురోహితప్రభావము.

నాటి యర్ధరాత్రమునఁ బాండవులును జిత్రరథుఁడును జాలసేపు సంభాషించిరి. ఆగంధర్వుఁడు వారికిఁ గడుంగూర్చు మిత్రుఁడయ్యెను. పాండవులును వానికిమిత్రులైరి. నాటిరాత్రి సంభాషణములోఁ జిత్రరథుఁడు “పాండుకుమారులారా ! పవిత్రచరిత్రుఁడును ధర్మజ్ఞుఁడునగు నొక బ్రాహణుని మీరు పురోహితునిగా నెంచుకొనుఁడు. అట్టి పురోహితునిఁ బురస్కరించుకొను రాజులకుఁ బాపభయంబును నపజయంబును గలుగవు. మీపూర్వుఁడైన సంవరణుండను రాజు పురోహితుని యనుగ్రహంబుననే తపతియను కన్యకను బడయఁగల్గెనని చెప్పెను. తోడనే పాండవులు సంవరణ చరిత్రంబును