పుట:Bala Neethi.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
84

బా ల నీ తి.

లేక సద్గుణములవలనగాని పాండితులవలనగాని, దానమువలనగాని, వన్నెకెక్కుచుండిన నాయన హిష్ణువులు చూడజాలక వారికిదగినటుల నెగ్గుల ఘటించుచు దుదకు వారిని దీనులుగాజేయుట కుంకించుచుందురు.

 పైజెప్పినవిషయములందెకాక ప్రతి విషయమందు నను దనకంటె నితరు డభివృద్ధిగానున్నాడనిన వానివృద్ధి నంతరింపజేయుటకు వీరు యత్నించు చుందురు. "ఒకరికి నున్నదని యేడ్వ నొకకన్ను, తనకు లేదని యేడ్వ నొంకొకకన్ను పోయినదను సామెత నిక్కమగుచున్నది. ఎందువలననన? ఈ యోర్వలేని వారు తమగతి ముందెటులగాగలదో దానిని విచారించకుందురు. కాబట్టి విచారించిన వారీయమా యక లిగియుండరని చెప్పగలను. అమాయకకలిగిన వారలు సర్వసుఖములవీడి యప్రతిష్టతో నవసానదశకు రాగలరు. 
  ఇట్లసూయభావముకలిగియట్టి  యధోగతికివచ్చిన  వారలు పూర్వులలో గొంతమందిగలరు. వారిలో నొకనిజెప్పెద.
  తనయనుజులు నలుగురు చేదొడువాదోడుగానుండ ధర్మరాజుచేయు రాజసూయాద్వరమబునకు దుర్యొధనుడరిగెను. అంత నతడా మహాద్వరంబు ముగిసిన పిమ్మట మయునిచే నివ్వబడిన సభజూచి యందలి చిత్రములుగాంచి యబ్బురపడెను. అంత నామహారాజాసభావిభవంబును, నారజమాయాధ్వర మహోత్సవంబును, గన్నులారజూడలేక పాండవుల వీడ్కొని నిజరాజదానియగు హస్తినాపురంబున