పుట:Bala Neethi.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

83

బా ల నీ తి.

     యోగ్యులగు ధనికులు కొందఱొకమంచివిద్వాంసు ని సన్మానించి యాయనకు బహుమానము లొస గుట కుద్యమించుచుండ నాసంగతి నీయనహిష్టు లెఱిగిన వెంటనే యాతని గౌరవించువారల వద్దకువెళ్ళి ముందు దాజెప్పుమాటలవారు నినను వినకపోయినను రహస్యముగా మెల్లగా" నాపండితుడు యోగ్యుడుకాడు కాన గౌరవపాత్రుడుకాడ" ను మొదలగు నసత్యాంశముల జేకొని స్వకీయధనముపోయినటుల కర్ణమంత్రముల నుపదేశించుచుందురు. కాని యీయన నహిష్టువాక్యములు యోగ్యులకవాచ్యము లుగా కన్పట్టును. 
     ఒకకవి లోకోత్తరసత్కవియై యాబాలవృద్దులచే గొనియాడ బడుచు రసవత్తరములగు దనపొత్తముల మొత్తముల జనుల చిత్తముల రంజింపజేయుచు లోకోపకారియై యెనగుచుండ గొంద ఱసూయాక్రాంత చేతస్కులై దురబిమానముచే నాకవీశ్వరుని బ్రకటనముగా దూలనాడుచు నెవ్విధముననైన నాకవీశ్వరునియశ నడుగంటుటకు బ్రయత్న మొనరించుచు గృతార్దులమని తలంచు చుందురు. నీనినిదగినటుల దండించిన వారలు లోకపూజ్యులని చెప్పవచ్చు.
 ఈయేర్వలేని వారందఱు మంచిజట్టుల గట్టి తిరుగుచుండినను మంచిమంచి యుపాయములతో నన్నమును వలపక్షముగా దినుచుండి నను, జనులందఱు సంతసమదువటుల బ్రాజ్యంబగు రాజ్యంబును బరిపాలించు చుండినను