పుట:Bala Neethi.pdf/95

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
82

బా ల నీ తి.

క్కువగా నతడు చెప్పుదానియందున బ్రవేశించకూ డదు. ఈ విషయము జ్ఞాపకముంచుకొనుడు.

క.ఇచ్చకము భువిని వశ్యము
   కుచ్చితమీలోకనింద♦కోవిదునకు నీ
   తుచ్చమున హాని వచ్చును
   మచ్చరమే తన్ను జెఱచు♦మహిలోనేమా!.

అ సూ య.

   ఓర్వలేనితన మసూయ యనబడు.

మనుజున కీయసూయయుండిన నభివృద్దికి రానేరడు. జనసుతులైన నీయసూయనుగలిగి యున్నయెడల వారు నిందాపాత్రులు కాగలరు. తనతొసమానమైన వారల కొంచముచ్చదశకుబోయిన యెడల వారిని గాంచి లోలోపల గుందుచు సమయమునువేచి వంచింప జూచుచుందురు. ఇట్టి యసహనము కలిగినవారలన సహిష్టులని యనెదరు. ఒకడు మంచిని జేయుటయె లేక వాడు ప్రజలచే సంస్తుతినిబొందుచుండుటయొకాంచియశక్తి దుర్జనులై యింటిలోపల నొకమూలన గూర్చుండి పరితాపము జెందువారు కొందరసహిష్టులుకలరు. అటులవృద్ది బొందినవానిని బాహాటముగా నసహిష్టు తాలాపముల నాడుచుండెడివారు మఱికొందఱు గలరు.