పుట:Bala Neethi.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

75

బా ల నీ తి.

గాంచి కర్తవ్యమేమియుతొచక యారాజుతో "రాజా నీవు సకలధర్మవేదివని వినియుంటిని. కాన బ్రస్తుత మాకలిచే మిక్కిలి బాధపడుచున్న నాకాహార విఘ్నము సేయదగునా? మఱియు "స్యేనా,కపోతాన్ ఖాదయన్తి" అనగా " డేగలు పావురములను భక్షించు"నను వేదవాక్యానుసారంబుగా నాకాహారంబుగా నున్నదీపావుతము.నాభార్యయు, పిల్లలు, నేను, నీకపోతాహారములేనియెడల జీవించలేము. నీవొక జీవమును రక్షించుట కనేకజీవముల హింసబెట్టుటధర్మమేనా?" యని యడిగను. అంతనావదాన్యుడు "నీవుచెప్పినదంతయు సత్యమే? కానిప్రాణభయముచే వచ్చి రక్షించుమని కోరినది. ఇట్లాశ్రయించినదానిని వెడలుగొట్టుట దర్మమేనా? చెప్పు"మని యడుగుచు"నీవుపక్షివైనను దర్మమెఱింగినటుల మాటలాడుచున్నావు. కాన నీకాననంబున నుండు మృగంబుల మాంసంబులదిని నీయాకలిని దీర్చుకొనుము. కాని యీకపొతముపై నిక నాశ విడువుము"అని పలికెను. అంత నాడేగ "రాజా! నేదినదగిన దిదియే. దీనిని రక్షించుటకు నీకిష్టమున్న నీమాంసంబు నాకాహారంబుగాని"మ్మని పల్కెను. వెంటనే యారాజు తనకత్తితో దన శరీర మంతయు నాడేగకాహారంబుగా నొసగెను. అంత నాడేగ పావురములారూపములవీడి తమ నిజ రూపములదాల్చి యారాజుతొ "మేము వానవాగ్నులము,నీదానమునకు, నీధర్మబుద్దికి మెచ్చితిమి. కాననీకీర్తి