పుట:Bala Neethi.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

109

బా ల నీ తి.

ను. వాడటులనె రాకపోయెను. మరల మఱియొక తమ్ముని బంపెను. వాడటులనె రాకఫోయెను. మఱియు నింకొక్కతమ్ముని బంపించెను. వాడటులనె రాకఫోయెను. ఇట్లునలుగురుతమ్ములెంతసేపటికి సలిలమును దీసికొనిరాకఫోవుటాగాంచి ధర్మరాజుగూడ బయలుదేఱి యాచెఱువుదరి జేరెను. అచ్చట దన తమ్ములందఱు నిర్జీవులై పడియుండుటజూచి యధికముగా దు:ఖించుచు గారణమారయుచుండెను. ఇంతలో నాకసమునుండి "ఇచటబడియున్న వారందఱు చెఱువునకు నాయకుడనగు నాయనుజ్ఞ లేనిదే ప్రవేశించి యీవిధమున నైరి. కాన నీవైనను నేనడిగిన ప్రశ్నములకు సదుత్తరములనిచ్చి యిందు బ్రవేశించు" మను మాటలు కొన్ని శ్రవణగోచరము లయ్యెను. అంతట ధర్మరాజు మగుడ "సరే" యని యుత్తరమొసగెను. అంత దత్తటాకనాయకుడు ముప్పది రెండు ప్రశ్నముల నాధర్మనందను నడిగెను. వానికి దగిన యుత్తరముల ధర్మరాజు వచించెను. అంత నాచెఱువున కధిపతియగుయక్షు డాతని యుత్తరములకు మెచ్చి "ధర్మజ్ఞా! నీవు నీరుద్రాగుము. మఱియు నిచట బెద్దనిద్దురజెంది యున్న యీనలుగురిలో నొకనిని బ్రతికించగలను. కాన నీకిష్టుడెవదో చూచింఛు" మని యడిగెను. అంత ధర్మరాజు, నకులుని నాకిష్టుడని చూచించెను. అంత నాయక్షుడు బలవంతులగు భీమార్జునులను గోరక నకులుని గొరుటకు గతమే" మని యడిగెను. అంత ధర్మరాజు "మహాత్మా! కుంతీపుత్త్రు