పుట:Bala Neethi.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
109

బా ల నీ తి.

     వివేకులు స్వయముగా బ్రతిచిషయమును జక్కగా బరిశీలిచి గ్రహించు చుందురు. దాన విశేషలాభములు కలవుగదా. ఇక వివేకదూరులన్ననో యటుల నొనరించుటకుపేక్షించుచుందురు. ఉపేక్ష జేయుట బహ్వనర్దదాయకముకదా. కాబట్టి మనము వివేకముకలిగియుండుదము, ఇది భావిభావుకసూచ కము. ఇది పూలనమ్మినయంగడినె కట్టెలనమ్మ నీయదు. ఈవివేకమువలన ననేకసుగుణములు పట్టువడును. మనమావివేకము కలిగియున్నయెడల దు;ఖములను బొందము. మనమొకవేళ హానిని బొందినను దీనిచేత దానినవలీలగా బోగొట్టుకొనగలము.  మనముదీనినలవరించుకొనుటకు సుజనసహవాస మొనరింపవలెను. వివేకము కల్గియున్నవారలు విశేష సౌఖ్యముల జెందగలరు.
    ఇటుల వివేకమున విశేషసౌఖ్యము జెందినవారలలో నొకనిని జూపుచున్నాను.
    తొల్లి ధర్మరాజు నగుగురుతమ్ములతో గొండొక కారణంబున నరణ్యవాసము జేయుచుండెను. ఇటులుండ నొకసమయమున దననలుగురు తమ్ములకు దాహమాయెను. అంత ధర్మరాజు జలమునుదీసికొనివచ్చుటకై మొదట నకులుని బంపెను. అంత నానకులు డొకచెఱువుజొచ్చి నీరు ద్రాగుటతోడనే యచటనే పడిపోయెను. అంతట ధర్మరాజు "నకులుడుదకముదీసికొనియింకను రాకపోయెను. ఇది యరణ్యముకదా" యని భయ మందుచు నింకొకతమ్మునిబంపె