ఆత్మవిచారము, ఉత్తరభాగము [౧ వ
నిత్యానిత్యవస్తు
వివేకమును మనము సంపూర్ణముగా నెరుగ
వలసినది ముఖ్యము. ఆత్మవిచారము, పూర్వభాగము, పుట ర
నందు ఆదిపురుషునికి ప్రజ్ఞానాంశువు లేక తురీయుడు లేక తురీ
యాత్మ యని పేళ్లు వాడుకలోకి తేబడియున్నవి. తురీయాత్మ
యొక్క ప్రతిబింబమునకు ప్రాజ్ఞుడు, ప్రాజ్ఞాత్మ, ఆత్మబుద్ధిమన
స్కుడు అను పేర్లు వాడబడియె. తురీయాత్మను ఉద్దేశించి చూచు
నెడల తురీయాత్మ సత్యం, ప్రాజ్ఞాత్మ మిథ్య, ఇది ఒక మెట్టు. రెండ
వది ప్రాజ్ఞాత్మ ప్రతిబింబిం చెననియు ఆ ప్రతిబింబమునకు తైజసవై శ్వా
నరు డని పేరు అనియు చెప్పబడియె. ఈ విషయమే ఉత్తరో త్తర
సందర్భములయందు అనేక తడవలు వివరింపబడి యున్నది.
ప్రాజ్ఞాత్మ సత్యం అని యుద్దేశించి తైజస వైశ్వానరుని చిం తించిన యెడల తైజస వైశ్వానరుడు ప్రతిబింబమైనందున మిథ్య. తైజసవైశ్వానరాత్మ యను రెండవ ప్రతిబింబము స్వర్గము మొదలు భూలోక స్థూలభాగ మంతటయు వ్యవహరించగల దనియు వ్రాయ బడియె. ఇట్టి వ్యవహారార్థముగా స్థూలశరీర మొక్కటి, ఆస్ట్ర లుబాడి యొకటి, అశుద్ధమానసశరీరము ఒకటి వెరసి మూడు శరీరముల నుపయోగించుచుండును అని చెప్పబడియె. ఈ శరీర ములకు దేహములు అని పేరు. దేహములను ఉపయోగించు వానికి దేహి యని పేరు. దేహిని యుద్దేశించి దేహములు అస త్యములు. ( దేహీ నిత్య మవధ్యోయం దేహే సర్వస్య భారత, " అని శ్రీమద్భగవద్గీతయందు చెప్పబడియున్నది. నిత్యానిత్యవస్తు వివేకమునందు దేహి నిత్యుడనియు దేహములు అనిత్యములనియు నిశ్చయముగా తెలిసికొనుట ముఖ్యము.