పుట:AntuVyadhulu.djvu/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

ఎనిమిదవ ప్రకరణము


గుర్రమును చంపుటకు శక్తిగల మోతాదులో ౨౦-వ వంతు మోతాదుల కొలతగా ధనుర్వాయు సూక్ష్మజీవులను ఎక్కింతురు. ఈ గుర్రమునకప్పుడు కొంచెము జ్వరము వచ్చి యది బాధపడినను మోతాదుచాలదు గనుక చావదు. ఈ గుణములన్నియు నయమైన తరువాత కొన్ని దినములకు తిరిగి మొదటి మోతాదుకంటె కొంచెము ఎక్కువ ధనుర్వాయు సూక్ష్మజీవులను ఆగుర్రముయొక్క రక్తములోనికి ఎక్కింతురు. దీనినికూడ గుర్రము జయించును. ఇట్లు అనేకసార్లు చేసిన పిమ్మట ఎంత హెచ్చు మోతాదు ధనుర్వాయువు సూక్ష్మజీవులను ఆ గుర్రమునెత్తురులోని కెక్కించినను అదిలెక్కచేయదు. ఈ ప్రకారము చేయుటవలన ఆగుర్రముయొక్కరక్తమునకు ఒకవిధమైన రక్షణశక్తికలిగినది. దానిరక్తమునందు ధనుర్వాయువుకలిగించు సూక్ష్మజీవుల విషమెంత వేసినను విరిగి పోవును. ఇట్లు చేయు శక్తి దానినెత్తురునందలి ద్రవపదార్థములో అనగా రసములో నున్నదిగాని కణములలో లేదు. ఈరసమును ఆ గుర్రమునుండి వేరుపరచి ఎంత పరిమాణముగల రసము ఎంతవిషమును విరిచి వేయగలదో శోధనలుచేసి నిర్ధారణ చేయుదురు. ఇట్లు శోధించి ఒక తులము రసము ఇన్ని లక్షల సూక్ష్మజీవుల విషమును విరిచివేయునని ఏర్పరతురు. వ్యాధియొక్క ఉద్రేకమునుబట్టి వైద్యుడు ఈ రసమును తగిన మోతాదులతో ఉపయోగించు కొనవలెను. పైనచెప్పిన కుప్పములోని రోగికి