పుట:AntuVyadhulu.djvu/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శరీరజనితరక్షణశక్తి

97


చుట యుక్తము. హంగేరీ దేశములో దొమ్మవ్యాధి తీవ్రముగ నున్నప్పుడు 16,082 గుర్రములకును, 2,10,750 పశువులకును, 11,18,443 గొర్రెలకును ఇట్టి టికాలువేయగా అంతకు పూర్వము వేయింటికి 25 చచ్చుమందలో వేయింటికి 5 పశువులకంటె యెక్కువచావలేదు. కాబట్టి దీని యుపయోగము రైతులందరు గుర్తెరిగి లాభమును పొందదగియున్నది.

౨. ఏ జంతువు యొక్క రక్తమునందు నొకజాతి సూక్ష్మజీవులుచక్కగ పెరుగవో ఆజంతువున కాజాతి సూక్ష్మ జీవులనంటించి వానితీవ్రము తగ్గించుట:—ప్రస్తుతము మశూచకము రాకుండ టీకాలు వేయుపద్ధతి దీనినుండి పుట్టినదియే. మనుష్యునకు తీవ్రముగవచ్చు మశూచియే ఆవునకంటునప్పుడు మిక్కిలితేలికయయినదై పొగుదుమీద కొన్ని పొక్కులుగా కనబడి దానికేమియును కీడుగలుగ జేయకుండ విడిచివేయును. ఈమర్మమును కనిపెట్టినదిమొదలు మశూచకమున కిప్పటి పద్ధతిని టీకాలువేయు నాచార మేర్పడినది.

ఇప్పుడు టీకాలువేయువాడుక యెల్లయెడల వ్యాపించి యున్నప్పుడు దీని విలువ మనకంతగా తెలియకపోవచ్చును. పూర్వకాలమునందు ప్రప్రథమమున మశూచకమొక దేశము నందు వ్యాపించినపుడు ఈ పెద్దమ్మవారు ప్రజలకుకలిగించు నాశమును, వికారరూపమును వర్ణింపనలవికాదు. అమెరికాదేశములో ౧౮-వ శతాబ్ద ప్రారంభమున ప్రవేశించి ఒక కోటి

7