పుట:Annamacharya Charitra Peetika.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

96 వారును నిట్లే యనేకదివ్యస్థలముల దేవతలపై సంకీర్తనముల రచించిరి. తాళ్ళపాకవా రాయాదేవతలకుఁ దిరుపతి వేంకటేశ్వరునితో నభేదము గల్పించి వేంకటేశ్వరనామముద్ర యుంచినటు క్షేత్రయుయు నాయాక్షేత్రమలదేవతలకు మువ్వగోపాలునితో నభేదము గల్పించి మువ్వగోపాలముద్రను సంకీర్తనములకుఁ గూర్చెను. త్యాగరాయలవా రాయాక్షేత్రములదేవతలఁ బేర్కొనుచుఁ గడపటి చరణమునఁ దన పేరే ముద్రగా వెలయించిరి. రాజస్తుతిపరాజ్ముఖత్వము దేవతార్చనవిగ్రహములను గోల్పోవుట మొదలగు విషయములు కొన్నియన్నమాచార్యునకును, త్యాగరాజునకును సమానముగాఁ దటస్థించినవి. అన్నమాచార్యుని శృంగార సంకీర్తన రచనాంశము క్షేత్రయ్యగాను ఆధ్యాత్మ సంకీర్తన రచనాంశము త్యాగయ్య గాను నవతారముదాల్చె ననఁజెల్లును. అన్నమాచార్యునట్లు సంకెళువేసి చెరలోనుంచుట స్వామి కృవ వలన నాక్లేశము తొలఁగిపోవుట రామదాసుగారికిని గలిగెను. అన్నమాచార్యుని వలుకుబళ్ళు అన్నమాచార్యుని సంకీర్తనములభాష పశ్చిమాద్ర దేశమున వాడుకగన్నది. ఆతనిపలుకుబళ్ళు చాలా కృష్ణరాయులయుఁ దదాస్థానకవులయు రచనలలోని కెక్కినవి. రాయలతో, దఱచుగాఁ దిరుపతికి వచ్చి స్వామి సన్నిధిని తాళ్ళపాకవారి సంకీర్తనముల వినుచుండుటచే నాయాకవులకు వీరి పలుకుబళ్ళు సుపరిచితములయి యుండవచ్చును. మచ్చుకుఁ గొన్ని చిగురుఁగొమ్మైనఁ జేవ, మీసాలపై తేనియల్, సందు సుడిమా యలు, తంగేటిజున్ను, నూతులుత్రవ్వితే బేతాళాలు బయల్పడును, కోలగర, పొరి విడంగాయములు, గోవాళ్ళు, చిందువందు, తలవూవాడక. తాళ్ళపాకవారి సంకీర్తనముల ఛాయలు వేమన పద్యములలోని కెక్కినవి.