పుట:Annamacharya Charitra Peetika.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

92 తిరువెంగళవ్ప ఈత ( డు గొవ్పవిద్వాంనుఁడు ఆవురు కావ్యవును దెలిఁగించినాఁడు. నామలింగానుశాసనమునకుఁ దెలుఁగువ్యాఖ్య రచించినాఁడు. కావ్యప్రకాశికకు వ్యాఖ్య రచించినాఁడు. é. 1554లో అంబతూరు తూప్పిల్ అగ్రహారములలో కొంతభాగము తిరుపతి గోవిందరాజస్వామి పెండ్లి తిరునాళ్ళ జరపించుటకుగా సమర్పించినాఁడు. క్రీ 1553లో చినకంచిలో అరులాళప్పెరుమాళ్ళకు వల్లత్తంజేరి పేరీచ్చంబాకము అను గ్రామము లిచ్చినాఁడు.' తిరువతి శాననములు తిరువతి దేవస్థానశాననము ಶೆಲ್ಲ నరవముననే కలవు. సర్వస్వతంత్రుఁడు దక్షిణాపథమునకెల్ల సార్వభౌముఁడును గాన యొక్క శ్రీ కృష్ణదేవరాయుఁడు మాత్రము గుడిలో నంన్కృతకర్ణాటాంధ్ర ద్రవిడములలోఁ దనశాసములఁ జెక్కించుకోఁ గలిగెను. తిరుమల తిరుపతి దేవస్థానమున గుడి గోపురములలోఁ దాళ్లపాక వారి శాసనములు నరవముననే యున్నవి. తిరుమల కొండక్రిందనే తాళ్ళపాక వారి యగ్రహారముగా నున్నమంగాపురమునఁదాళ్ళపాక చినతిరుమలాచార్యుఁడు తాను గట్టించిన కళ్యాణ వెంకటేశ్వర దేవాలయమున శాసనము లన్నింటిని తెలుఁగుభాషలోఁ దెలుఁగులిపిలోనే చెక్కించెను. శు దాంద్రులంున వుమానీయులు సాళువతిమ్మన, గోవిందన, బయు కారరావుయు వెుదలగువారు శ్రీస్వామివారి కర్పించిన యగ్రహారాదుల శాసనములుగూడ ద్రవిడముననే ద్రావిడీకరణముఁ బడసిన పేర్లతోనే యున్నవి. శాసనము లెల్ల ద్రావిడముననే యుండుటకుఁ గారణము దేవస్థానస్థానపతులు ద్రవిడు లగుటయే. గుడిలో శాసన ములఁ జెక్కించుట కధికారులు వారే. తిరుమలాచార్యాదులు పదులకొలఁది గ్రామములను స్వామికి సమర్పించుకొన్నారేకాని గుడిలో 1. పై చరిత్రవిషయములు పెక్కులు శ్రీసాధుసుబ్రహ్మణ్యశాస్రులుగారు రచించిన శాసనముల రిపోర్టులోని విషయములు శాసనములు చదివి సమకూర్చినవి.