87 పరమబంధుఁడ వైనా పరికింప నీవే الجدد: دكة వరుస నేఁ జెడకుండ వహించుకొంటివి ዘöሞክ11 తల్లివైన నీవే సుమ్మీ తగినవిషయాలలో ప్రల్లదానం బడకుండా బ్రదికించితి | అలుకొని తోడునీడవైనా నీవే సుమ్మీ ! చిల్లర మాయలలోనఁ జెడకుండాఁ జేసితి |கு1ை2 ధాతవు నీవే సుమ్మీ తగు శ్రీ వేంకటనాధు నాతలఁపులో నిలిపి నమ్మంజేసితి ! యేతలఁ జూచినా నాకు నేడుగడయు నీవే ! ఆతల నీతల నన్ను నాచుకొని కాచితివి I€ত"॥3 చినతిరు. అధ్యా 7తేకు. కాన యీతఁడు § 1495 ప్రాంతముల జన్మించినవాఁ డను కొనవచ్చును. క్రీ. 1553 దాఁక నీతనిశాసనము లున్నవి. ఈతఁడు సంస్కృతాంధ్రములందు మహాకవి, మహావిద్వాంసుఁడు, అష్టభాషాకవి చక్రవర్తియని బిరుదుగలవాఁడు. తండ్రితాతలవలెనే అధ్యాత్మ శృంగార సంకీర్తనలను రచించినాఁడు. తెలుసంకీర్తన లక్షణము, అష్టభాషా, దండకము రచించినాఁడు (ఇవి ముద్రితములు చూ, తాళ్ళపాక1 వాల్యుం) శ్రీవెంకటేశ్వరస్వామికి దిగువ తిరుపతిలో వేల్పులకుఁ గూడఁ జాలా కైంకర్యములు కావించినాఁడు. అందు ముఖ్యములు గొన్ని గోవిందరాజస్వామికి, పెండ్లి తిరునాళ్ళు (వైవాహికోత్సవము) జరుపుటకు నేడియం అనుగ్రామము రాబడిలో సగమిచ్చినాఁడు. గోవిందరాజ విట్టలేశ్వరాచ్యుత పెరుమాళ్ రఘునాథ వరదరాజ లక్ష్మీనారాయణులకును హనుమదాలయములోఁ దాను ప్రతిష్టించిన నరసింహస్వామికిని కైంకర్యములకై చిత్రిచిత్రానక్షత్రమునఁ దన తిరునాళ్ళలో వైశాఖమృగశిరను దనతండ్రి తిరునాళ్ళలో గోవిందరాజస్నామి గుడిదగ్గఱి సుదర్శన చక్రమునకుఁ గైకర్యములకై 200 రేఖై పొన్నుల రాబడిగల వెదుమప్పాకంగ్రామము నర్పించినాఁడు.