పుట:Annamacharya Charitra Peetika.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8] పరిపాలన కాలమున నీతఁడు శ్రీవెంకటేశ్వరస్వామికిఁ గొన్నికైంకర్యములు జరపి నను నందు సాళ్వతి వ్మురునును నాతని తవ్ముఁడగు గోవిందయ్యుయు నిర్వాహకులుగా నుండిరి. అశాననములలో శ్రీకృష్ణరాయలపేరు లేదు. పెదతిరుమలయ్యకును నాతని యన్నయగు నరసింహకవికిని శ్రీకృష్ణరాయనితో వైరస్యము గల దనుకొనుట క్రింకొక సాధనము: 'మండెమురాయునామక నరసింహ దండనేత్రు (తృ?)న కిష్టధనబలస్పూర్తి" నని యన్నమాచార్య చరిత్రముననున్న వాక్యమునకు మండెము రాయఁడను నామాంతరముగల నరసింహ దండనాధుఁ డని యర్థముగావచ్చు నని యనుకొంటిమి. (చూ.పుట. 286) పయిమండెము కడపమండలము చినమండెము అనీ, చితూరు మండలమున గాజులమండెము చిఱుమండెము అనీ కలగ్రామములలో నొకటయి యుండఁబోలును. ఆయూర పెదతిరుమలయ్య నెవరో కత్తితో నఱకిరట. ఆకత్తివ్రేటాతనికిఁ గలువదండ యైనదట ! “మండెము కోటలో మండలం బెఱుఁగ మండలాగ్రాహతి మహనీయ పుష్ప దామమై ధర్మాంగదస్థితిఁ బొలిచె నేమహామహుని యహీనగాత్రమున" నని చిన్నన్న చెప్పినాఁడు. దేవకీపురవాస్తవ్యుఁడగు నరసింహ దండనాధుఁ డిందు వ్రయోజకుఁడే వెూ! ఈ విషయువు పెదతిరుమలాచార్యుఁడే యిట్లు సంకీర్తనమునఁ జెప్పకొన్నాఁడు. శంకరాభరణ నాఁటికి నాఁడు గ్రోత్త నేఁటికి నేఁడు గ్రోత్త! నాటకపుదైవమవు నమో నమో పల్లవి సిరుల రుక్మాంగదుచేతికత్తిధార దొల్లి వరునధర్మాంగదుపై వనమాలాయ |