Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



77

తివిరి వెంకటాధిప నేను నీ |
కప్పఁగిటి కబ్బితి గదనేఁడు|
రవరవ చెమటఁ గరఁగి నేడూ యిదె !
చవులాయెను నీజాజఱ ||చూలు|| 3

అన్న, శృంగా. 87 ఱేకు.

నాచనసోమనగూడ వసంతవిలాసమున జాజఱ నిట్లు వర్ణించినాఁడు:

"వీణాగానము వెన్నెలతేట | రాణమీఱఁగా రమణులపాట |
ప్రాణమైనపిన బ్రాహ్మణువీట | జాణలుమెత్తురు జాజఅపాట"||

ఇంతకుఁ జెప్పవచ్చిన దేమనఁగా విద్యానగరవినాశముపిదప అంధ్ర దేశమున సంగీత మన్నఁ గొంత యశ్రద్ద పెరిగినదనుట. అదికారణముగాఁ బ్రాచీనగేయరచన లెన్నో అంతరించి పోయినవి. దాగియున్నను రాగిరేకుల మీఁది కెక్కియుండుటచే నేఁటి కయినను దాళ్ళపాక సంకీర్తనములు పైకి రాఁగల్గినవి.

అన్నమయు నంతానము

నరసింహకవి

అన్నమాచార్యుని ప్రథమభార్యయగు తిరుమలమ్మకు నరసింగన్న, నరసయ్య, నరసింహాచార్యుఁడు అని పేర్కొనఁబడువాఁడు చాలా గొవ్పకవీశ్వరుఁడు కొడు కుండెను. నిరుపమాన నుకవితా నిర్వాహకుఁడయిన తెనాలి రామకృష్ణకవి తనసమీపకాలమువా రగు తాళ్ళపాక కవుల నిట్లు సన్నుతించెను.

క|| చిన్నన్న ద్విపద కెఱఁగును
పన్నుగఁ బెదతిరుమలయ్య పదమున కెఱఁగున్ ! మిన్నంది మొరసె నరసిం
గన్న కవిత్వంబు పద్యగద్యశ్రేణిన్ | 1

[1]

———————————————————————————————

  1. రామకృష్ణునికిఁ జిన్నన్నకు. నూ జేండ్లతర్వాత నప్పకవీయమున నీపద్య ముదాహృత మయినది.