పుట:Annamacharya Charitra Peetika.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

44 శ్రీమద్వీరనృసింహరాయనృపతే ర్భూదేవహత్యావ్యధాం దూరీకృత్య తదర్పితోజ్ఞ్వలమహాసింహాసనే సంస్థితః శ్రీమత్పూర్వ కవాటనామకవరే సర్వేష్టసిద్ధిప్రదః శ్రీశ్రీపాదయతీంద్ర శేఖరమణి ర్భూయా త్సవః శ్రేయసే. క్రీ. 1440 నాఁటికి బదునాజేండ్లవాఁడయిన యన్నమాచార్యుఁ డీ రాజోప్లవము లెల్ల నెఱుఁగున్నాడు. నరసింహరాయలప్రార్ధనమునఁ గాబోలును దఅచుగా విద్యానగరమున కరగుచు నక్కడ వెలసియున్న వేల్పులపై పెక్కుసంకీర్తనముల రచించినాఁడు. ఆయూకాలములలో నాతని కక్కడిరాజుల దౌర్జన్యములు ప్రత్యక్షము లగుచుండెడివి. రాజ్యలబ్దికై నాఁటి రాజులు చేసిన పితృభాతృపుత్రహత్యాదుల నాతఁడు సంకీర్తనములలో వివరించి విలపించినాఁడు. శ్రీరాగం వెఅతు వెఱతు నిందు వేడుకపడ నిట్టి కుఱుచబుదుల నెటు గూడుదునయ్యా ||పల్లవి| దేహమిచ్చినవానిఁ దివిరి చంపెడువాఁడు ! ద్రోహిగాక నేఁడు దొరయటా ! ఆహికముగ నిట్టి అధమవృత్తికి నే ! సాహసమున నెట్టు చాలుదునయ్యా Iાર્ડગ89ગIા 1 తోడఁబుట్టినవానిఁ దొడరి చంపెడువాఁడు ! చూడ దుషుఁడుగాక సుకృతియట ! పాడైనయిటువంటి పాపబుదులు సేసీ ! నీడ నిలువ నెటు నేరుతునయ్యా iకుఱు! 2 1, దీనిని దొలుత కర్ణాటచరిత్రకారులు గుర్తించిరి.