పుట:Annamacharya Charitra Peetika.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

41 భైరవి చూడుఁ డిందఱకు సులభుఁడు హరి | తోడునీడ యగు దొరముని యితఁడు ||పల్లవి| కైవల్యమునకు గనకపుఁదాపల ! త్రోవై శ్రుతులకుఁ దుదిపదమై ! పావన మొకరూపమై విరజకు ! నావై యున్నాఁ డిదే యితఁడు |చూడు|| 1 కాపాడఁగ లోకములకు సుజాన ! దీపమై జగతికిఁ దేజమై పాపా లడపఁగ భవపయోధులకు తేపై యున్నాఁ డిదేయితఁడు |చూడు|| 2 కరుణానిధికి రంగపతికిఁ గాంచీ | వరునకు వేంకటగిరిపతికి నిరతి న హెూబలనృకేసరికిఁద | త్పరుఁ డగుశఠకోపముని యితండు |చూడు|| 3 అన్న అధ్యా. 1 వాల్యుం. అన్నమాచార్యుఁడు మంచిప్రాయముననే రామాయణమెల్ల కీర్తనాత్మకముగా వెలయించెను. (చూ. 30 పుట) అన్నమాచార్యుని సంకీర్తన ములలో రామాయణకథా ఘటితములు చాలఁగలవు. అన్నమయ సంకీర్తన పద్ధతి జగన్మోహనమై ప్రఖ్యాతికెక్కెను. అది విని సాళ్వనరసింగ రాయఁ డన్నమయదర్శన మపేక్షించెను. ఈ నరసింగరాయఁడు టంగుటూరి పాలకుఁ డని నాళీకబాంధవాన్వయుఁ డని యిం దున్నది (చూ. పుట 31) అతఁడు చంద్రవంశమువాఁ డని శాసనములందును గ్రంథములందు నున్నది. ఇందునాళిక “బాంధవా" ఉండుట "శాత్రవా' ఉండుటకు వ్రాఁతగాని చేతప్ప గాఁబోలును. నరసింహరాయఁడు విజయనగరపుఁ 1. టంగుటూరు కడపజిల్లా రాజంపేట తాలుకాలో నున్నది.