Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

వేనామాల వెన్నుండా వినుతించ నెంతవాఁడ ! కానిమ్మని నా కీపుణ్యము గట్టితి వింతేయయ్యా || దాచు || 2

ఈమాట గర్వముగాదు నీమహిమే కొనియాడితిఁ గాని ! చేముంచి నాస్వాతంత్ర్యము చెప్పినవాఁడఁ గాను ! నేమానం బాడేవాఁడను నేరము లెంచకుమీ ! శ్రీమాధవ నే నీదాసుఁడ శ్రీవేంకటేశుఁడవయ్యా || దాచు || 3

అన్న అధ్యా. 169 ఱేకు.

లలిత

బల్లిదులు నీకంటెఁ బరు లున్నారా నన్నుఁ ! దొల్లిటి బారి నింకం దోయకు మోయయ్య || పల్లవి ||

చిక్కులభవములఁ జేరం జిక్కి వోపలేక ! నిక్కి నీమఱుఁగు చొచ్చి నిలిచితివి ! అక్కజమై యల్లనాఁటి అప్పలకర్మము లెల్ల ! ఇక్కడనే చుట్టుముట్టీ నేమి సేతునయ్య || బల్లి || 1

లచ్చి సంసారమునకు లగ్గ మచ్చితీరలేక ! యిచ్చట నిన్నుఁగొలిచి యొక్కువైతిని ! పొచ్చముల నల్ల నాఁటి వూఁటదీర దని కొన్ని ! బచ్చన బందాలు వచ్చెఁ బాపఁగదవయ్య || బల్లి || 2

అంచల నింద్రియముల కరివెట్టి పెట్టలేక ! ముంచి నీపాదలకు మొఱవెట్టితి ! పొంచిన శ్రీవేంకటేశ భువనరక్షకుఁడవు ! పంచలనున్నాఁడ నన్నుఁ బాలించవయ్య ||బల్లి || 3

అన్న అధ్యా, 361 కుఱే

సకల వేదాంతశాస్త్రము నన్నమయ యుధ్యయనముగావించెను. ఈ శఠకోప ముని అహెూబలమఠ ప్రతిష్టాపనాచార్యులయిన యాదివన్ శఠకోప మునీశ్వరు లగుదురు. అన్నమయనాఁట నీశఠకోపయతులే వర్తిల్లిరి. ఆముక్త మాల్యదలో శ్రీకృష్ణదేవరాయలవారీశఠకోపయతిని సన్నుతించిరి. (చూ. ఆశ్వా 7 వచనము) అన్నమాచార్యుఁ డీయతివర్యునిట్లు కీర్తించెను.