Jump to content

పుట:Annamacharya Charitra Peetika.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

తాళ్ళపాకవారి సంకీర్తనములలో నిప్పటికి నేఁ జూచినంతలో పునుగుతైలముతోడి కస్తూరీకర్పూరమిశ్రితమయిన పాదతీర్ధమే ప్రస్తుతమయినది గాని నేటి శ్రీపాదరేణుసంకలనరీతిగాని శ్రీపాదరేణునామముగాని కానరాలేదు.ః ఒక సంకీర్తనము:-

శంకరాభరణము

శ్రీహరిపాదతీర్ధంబే చెడనిమందు! మోహపాశాలు గోసి మోక్షమిచ్చే మందు ||పల్లవి||

కారమై కంటగించని కడుఁ జల్లనిమందు! నూఱనికాచనియట్టి నున్ననిమందు! కోరికతో వెలవెట్టి కొనితేవల్లనిమందు! వేరువెల్లంకులు కూర్చనట్టి వెందువోనిమందు ||శ్రీహరి|| 1

గుఱుతైనరోగములు గుణముచేసేమందు! దురితములు పెడఁబాపే దొడ్డమందు! నిరతముబ్రహ్మదులు నేరుపుతో సేవించేమందు! నరకము సారనట్టినయమయినమందు ||శ్రీహరి|| 2

పొంకముతో భయములు పొందనియ్యనిమందు! మంకు బుద్ధులు మాన్పి మన్నించేమందు! పంకజాక్ష వేంకటరమణ ప్రపన్నునిమందు! సెంకించక తనదాసులఁ జేపట్టేమందు ||శ్రీహరి|| 3

అన్నమాచార్యుని సంకీర్తనములలో గుర్తుస్తుతిపరములుగా రచనలు చాలఁగలవుగాని ఆగురువు పేరేమో సరిగ్గాఁ దెలియరాలేదు. ముద్రాధారణానంతరము వైష్ణవు లీతని బంతి నిడుకొని భుజించిరట (చూ 28 పుట) అన్నమాచార్యునినాఁడే యీ వంశమువారు వైష్ణవు లయిరి. ఈ విషయము నీతిని పెద్దమనుమఁడు చినతిరుమలాచార్యుఁ డిట్లు చెప్పుకొన్నాఁడు.