పుట:Annamacharya Charitra Peetika.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

16 చింతచెటు దాటినతర్వాత నరసింహస్వామి, తలయేరుగుండు, అక్కడనే శ్రీపాదములు నున్నవి. కొండమీఁది కెక్కువారును, దిగువారును తలనొప్పి కాలునొప్పి కలుగకుండుటకై యూగుండును దలతో మోకాళ్ళతోఁ దాఁకుదురు. కనుకనే దానికిఁ దలయేరుగుం డన్న పేరయ్యెను. (చూ. 14 పుట.) శ్రీపాదములు శ్రీరానానుజాచార్యులవారు తిరుపతికి విచ్చేసి కొండ పై స్వామిసన్నిధిని మూన్నాళ్ళు వసించి, యుటుపై దిగువ తిరుపతిలో నొకవత్సర వునెలకొని తిరువులనం బిగారికడ రావూయుణ రహస్యార్ధములఁదెలిసికొనిరట! తిరుమలనంబి ప్రొద్దుట స్వామిని సేవించి కొండదిగి యుడిపడికడ దలయేరుగుండు దగ్గఱిమండపమునకు రాఁగా రామానుజాచార్యులవారు గోవిందరాజ సన్నిధినుండి యక్కడికరిగి రహస్యార్ధములఁ దెలిసికొనుచుండెడివారట. తిరుమలనంబి యొు(క నాఁడు స్వామిసన్నిధిని మధ్యాహ్నపూజ సాగదయ్యెఁగదాయని ఖిన్నుఁడు కాఁగా స్వామి నీకాకొఱఁత తొలగిపోఁగలదు. దుఃఖింపకు మని స్వపోద్బో ధము కావించిరట. మఱునాఁడు ప్రాతఃకాలపూజచేసి వచ్చి రామానుజుల కుపదేశము చేయుచుండగా మధ్యాహ్నపూజా సమయమునకు దివ్యకుసుమ తులసీ మృగమదకర్పూర సుగంధముతో స్వామిపాదములు ప్రత్యక్షమయ్యెనట. తదాది శ్రీపాదముల కక్కడ ప్రతిష్ట కలిగెను. ఇతిహాసమూలలోనే ఈ కథ. סיף ככ$: బ్రహ్మగడిగిన పాదము బ్రహ్మము దా నీపాదము పల్లవి చెలఁగి వసుధ గొలిచిన నీపాదము! బలి తలమోపిన పాదము!