పుట:Annamacharya Charitra Peetika.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

11] 'మఱియు నమ్మహదేవుండు మదీయువూ తావు హవంశ శిఖారత్నంబగు నన్నమాచార్యునకు జామాతరం డనిపించుకొని, భవదీయ సంకీర్తనంబు లాలించిన కర్ణంబుల నితరసంకీర్తనంబు లాలించ నని" ప్రతిజ్ఞ గావించెనట." దేవాలయములో సంవత్సరోత్సవములను తెలుదేశమున కళ్యాణోత్సవము లనీ, ద్రవిడదేశమున బ్రహె్మూత్సవము లనీ, నేఁడు పేర్కొనుట కలదు. ఆలయములలో స్వామిప్రతిష్టజరగిననాళ్ళే యా యుత్సవములనాళ్ళట. శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మప్రతిష్టితుఁడు గనుక ఆప్రతిష్ట జరగించిన బ్రహ్మపేర తిరుపతి వర్ణోత్సములు బ్రహె్మూత్సములయ్యె ననీ దాని ననుసరించి దక్షిణదేశపు దేవోత్సములకెల్ల బ్రహె్మూత్సవము లని పేరు సంక్రమించెననీ ఆయుత్సవములలో కళ్యాణము జరుపుట తెలుదేశమునఁ గొత్తగాఁ గలిగిన యాచారమని శ్రీపరవస్తు రామానుజ స్వామి ఎం. ఏ. గారు చెప్పచున్నారు. బ్రహె్మూత్సవము: అహిర నానా దిక్కుల నరు లెల్ల వానల లోననె వత్తురు గదలి |పల్లవి: సతులు సుతులుఁ బరిసరులు బాంధవులు హితులు గొలువఁగా నిందరును! శతసహస్ర యోజనవాసులు సు! వ్రతములతోడనె వత్తురు గదలి నానా 1 ముడుపులు జాళెలు మొగిఁ దలమూటలు! కడలేనిధనము గంతలును కడుమంచిమణులు కరులు దురగములు! వడిగొని చెలఁగుచు వత్తురు గదలి יסיסוןit 2