పుట:Andrulasangikach025988mbp.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గమనింపదగినది, పాచికలు వేయువాడు పాచికలు లొడిపి నేలపై వేసినప్పుడు కృత (నాలుగు చుక్కల భాగము) పైకిపడిన వాడు తక్కిన మూడిండ్లపై పెట్టిన పందెములను పూర్తిగా తీసుకొనెడివాడు. ఛాందోగ్యోపనిషత్తులో నిట్లు వ్రాసినారు.

       యథాకృతాయ విజితాధరే యా:
       సం యంత్యేవమేనం సర్వం తదభిసమేతి
       యత్కించ ప్రజా: సాధు కుర్వంతి
       యస్తద్వేదయత్ సవేద పమయై తదుక్త ఇతి.

---ఛాందో. 4, 1, 4.

పాచికలాడువానికి కృత అను దిక్కుపడిన తక్కినభాగముల పందె లన్నియు వాడే గెలిచినట్లుగా, ప్రజలు తాము సేయు సాధుకార్యములవల్ల మంచి ఫలము లన్నింటిని అనుభవింతురు అని పై మంత్రభావము. ఇట్టి యుదాహరణమునే అదే యుపనిషత్తున మరొకమారు (4, 3, 8, లో) చేసినారు.

మహాభారత కథయంతయు ఈ యక్షఖేలనముపై నడచినది. పాండవ కౌరవు లీ కలికృతాదినామములుకల అక్షములతోనే యాడిరని భారతమువలన తెలియగలదు. విరాటపర్వమున ఉత్తర గోగ్రహణమున అర్జును స్తుతించిన ద్రోణుని దూషింపగా అశ్వత్థామ ఇట్లనెను.

       కుటిల బుద్ధు లిచట గొనవునెట్టన ఘన
       పోర్బలంబు మెరసితొడర వలయు
       నతడు గాండీవమున నడ్డసాళులు వైవ
       డరుల సంపవాన గురియుగాని.

తెనుగులో స్పష్టముగా లేదుగాని సంస్కృత మూలమున నిట్లు వ్రాసినారు.

       "నాక్షాన్ క్షిపతి గాండీవం సకృతం ద్వాపరం నచ
        జ్వలతో నిశితాన్ బాణాం స్తీక్ష్ణాన్ క్షిపతి గాండివం"

అర్జునుడు గాండీవముతో కృతము. ద్వాపరము అని చుక్కల లెక్క పెట్టుచూ జూదమాడడు. ప్రాణాలుతీసే బాణాలు వేసినప్పుడు అత డెట్టివాడో