(2) మైలారుదేవుడు - ఇతడు ఏకవీరవలెనే జైనదేవుడై తరువాత శైవుడయ్యెనేమో! "భైరవునితోడు జోడు మైలార దేవుడు" మైలారను గ్రామమున వెలసి మైలారుదేవు డయ్యెను.[1]
(3) ఇతర దేవతలు - భైరవుడు, చమడేశ్వరి, వీరభద్రుడు, మూసానమ్మ, కుమారస్వామి, పాండవులు, స్వయం భూదేవుడు (శివుడు) ముద్దరాలు ముసానమ్మ.[2]
(4) వీరగడ్డములు - నేటికిని చాలగ్రామములలో వీరగుడ్డమ్మలు కలవు. ఏదో వీరకృత్యము చేసియుండిన స్థానిక వీరుని పూజసేయుట ఆచారమై యుండెను. పల్నాటివీరుల యుద్ధము క్రీ.శ. 1132 ప్రాంతముదని ఉమాకాంతముగా రన్నారు. ఆ వీరుల పూజను నేటికిని పల్నాటిలో చేయుచున్నారు. ఆ యుద్ధము ముగిసిన నాటినుండియే వీరపూజ ప్రారంభమయ్యెను. ఓరుగంటిలోను,
"పలనాటి వీర పురుష పరమ దైవత శివలింగ భవన వాటి" యుండెను.[3]
"కులము దైవతంబు గురిజాల గంగాంబ
కలని పోతులయ్య చెలిమికాడు
పిరికికండ లేని యరువది యేగురు
పల్లెనాటి వీరబాంధవులకు"[4]
కలని పోతులయ్య, గురిజాల గంగమ్మ అను గ్రామ దేవతలును ఉండిరి.
(5) మాచెర్ల చెన్నడు - చెన్నకేశవుడు అను దేవత "మాచెరల చెన్నడు శ్రీగిరి లింగముం గృపాయత్తత జూడ" అన్నందున చెన్నకేశ పుడనవలెను.
పల్నాటి కథలో బాలచంద్రుని తల్లి సంతానమునకై నోచిన గజనిమ్మ నోములో చెన్నకేశవుని పూజ మాచర్లలో చేసినట్లు తెలిపినందున మాచర్ల చెన్నడు చెన్నకేశవుడే యని దృడపడినది.