పుట:Andrulasangikach025988mbp.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాల్కురికి సోమనాథుని కెరింగించి రనియు అ 'ధూర్తవిప్రులు' కొందరికి శైవవేషములువేసి ఓరుగంటికి వెళ్ళుచున్న సశిష్యుడగు సోమనాథు నెదుటికంపగా ఆ కుహనాశైవులు నిజమగు శైవభక్తులైరనియు పిడుపర్తి సోమనాథుడు (క్రీ.శ. 1600 ప్రాంతమువాడు) వ్రాసెను. పైవర్ణనలలో అనేక విషయాలు వ్యక్తమవుతున్నవి. దేవాలయలలో మతపురాణాలను చదువుట, జనులు భక్తిశ్రద్ధలతో గుమిగూడి వాటిని వినుట, నూతన వీరశైవులను ప్రతిఘటించిన వారిలో 'విప్రులే' ప్రాముఖ్యము వహించుట, అందుచేత వీరశైవ సాంప్రాదాయ ప్రవర్తకులకు బ్రాహ్మణులతో పలుమారు సంఘర్షణములు కలుగుట, వీరశైవులను బ్రాహ్మణులు 'పతితులను'గా నిర్ణయించుట, బౌద్దమత ప్రచారానికి జనసామాన్య బాషయగు పాలీని సాధనముగా గొనినట్లు వీరశైవులు తమ పురాణాలను సంస్కృతములో వ్రాయక కర్ణాటాంధ్రభాషలలో ప్రచారముచేయుట, అందులోను నన్నయ నాటినుండి నిరాదరముపొంది తుదకు వేణుగోపాల శతకకారుని కాలమువరకు అనగా క్రీ.శ. 1600 వరకు "ద్విపద కావ్యంబు ముదిలంజ, దిడ్డికంత" అన్నియు నొకటే యనిపించుకొన్న ద్విపదలోనే, అందులోను ప్రాసయతితోను, ప్రాసరాహిత్యముతోను 'శివకవిత' నెగడించి ప్రచారముచేయుట, అందుచేత 'ఈ నడుమ, పెనిచె మధ్యవళ్ళుపెట్టి ద్విపద' అను తిట్టునకు గురియగుట, ఓరుగంటిరాజులు జైనమును వదలి, 'హరుని గొల్వ' శివాలయమునకు పోవుట, 'ఈ నడుమ' వెలువడిన శివపురాణాలను విందమను నాసక్తి కొంతవరకైన ప్రభువులలో కానవచ్చుట, ఈ పద్యము వల్ల మనకు స్పురించుచున్నవి. జైనులను నానాహింసలపాలు చేసినట్లు పాల్కురికి సోమనయే తెలిపినాడు. జైనులను రాళ్ళతో కొట్టి హింసించిరి. [1] "జిన సమయస్థులను తాటోబుపరిచి"నట్లు కొన్ని తావులలో పాల్కురికి సోమనాథుడు వర్ణించెను. ఈ విధముగా క్రీ.శ. 1600 వరకు జైనము క్షీణించి దాని స్థానములో వీరశైవము నెలకొనెను.

  1. "జైన" బౌద్ద దార్వక దుష్పథ సమయములు, మూడును నిర్మూలనముగ జేయుదనుక, మూడురాలసు వైతు ముప్పొద్దు నిన్ను. (బసవపురాణం - పాల్కురికి పు. 180) వసుధలో జిమలనువారి నందరను, నేలపాలుగజేసి, (పాల్కురికి జన పు. 192)