పుట:Andrulasangikach025988mbp.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

      ప్రమథపురాతన పటుచరిత్రములు
      క్రమమొందు బహునాటకము లాడువారు

  • * * *

      అమరాంగనలు దివినాడెడుమాడ్కి నమరంగ గడలపై నాడెడువారు
      ఆ వియద్గతి యక్షులాడెడునట్టి భావన మ్రోకులపై నాడువారు
      భారతాది కథలు చీరమరుగుల నారంగ బొమ్మల నాడించువారు
      నాదట గంధర్వ యక్ష విద్యాధరాదులై పాత్రల నాడించువారు'

భాస్కర శతకకారు డెవ్వడో తెలియదు. అతని కాలములోను తోలుబొమ్మలాట. వ్యాప్తిలో ఉండినది.

     'ఇంచుక నేర్పు చాలక విహీనత జెందిన నా కవిత్వమున్
      మించు వహించె నీకతన మిక్కిలి యెట్లన తోలుబొమ్మలన్
      మంచి వివేకి వాని తెరమాటున నుండి ప్రశస్తరీతి నా
      డించిన నాడవే జనుల డెందము నింపవె ప్రీతి భాస్కరా'

భాస్కర శతకమును జంటకవులు రచించిరని కొందరు విమర్శకులు వ్రాసినారు. ఈ పద్యములో 'నా కవిత్వము' అన్న మాటతో ఆ కథ యెగిరి పోయినది.

తెనుగు దేశములో మరొక వినోద విశిష్టత కానవస్తున్నది. అది విప్ర వినోదము అనునట్టిది. ఒక జాతి బ్రాహ్మణులు ఏదో క్షుద్రదేవతోపాసనవలననో మంత్ర తంత్రాల వలననో చిత్రమగు గారడి చేయుదురు. ఇప్పటికినీ ఆ వినోదము చేయు విప్రులున్నారు. గుంటుపల్లి ముత్తరాజు అను సర్దారు గోలకొండ సుల్తానుల తుదికాలములో ఉండెను. అతని గూర్చి యొక చాటు విట్లున్నది.

     "సంతత మారగించునెడ సజ్జనకోటుల పూజసేయు శ్రీ
      మంతుడు గుంటుపల్లికుల మంత్రి శిఖామణి ముత్తమంత్రి దౌ
      బంతియె బంతిగాక కడుపంద గులాముల బంతులెల్ల నూల్
      బంతులు, దుక్కిటెడ్ల మెడ బంతులు, విప్రవినోదిగారడీ
      బంతులు, దొంగవాండ్ర ములు బంతులు సుమ్ము ధరాతలంబునన్

క్రీ.శ. 1700 తర్వాత తెనుగు దేశములో భూవ్యవహార మంతయు మహారాష్ట్ర పద్ధతిపై సాగినట్లున్నది. ఒక చాటు విట్లున్నది.