పుట:Andrulasangikach025988mbp.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

           నేయిలేని కూడు నీయాస కపవది
           కూరలేని తిండి కుక్కతిండి॥

నేయి, కూర ముఖ్యముగా జనుల భోజనములో చేరియుండె ననుట సాధారణ విషయమే.

       'నాగుబాముగన్న నంబి బ్రాహ్మణుగన్న
        చెవులపిల్లిగన్న చేటువచ్చు
        గరుడుని గనుగొన్న గలుగును కోరికల్ ॥
విశ్వ॥

ఇప్పటికినీ జనులలో అవే విశ్వాసాలున్నవి. (కాని మూడ విశ్వాసాలను ఖండించిన వేమన ఈ పద్యము వ్రాసియుండడు.)

'ముండమోపి కేల ముత్యాల పాపట' అనుటచే సంపన్నులగు కొందరు ముత్తైదువలు పాపటలో ముత్యాలసరము నుంచుకొనిచుండి రనవచ్చును.

వేమన, బసివిరాండ్రను పలుమారు పేర్కొనెను. బసవశబ్దము వృషభ శబ్దభవము. ఇంటిలో ఒక యాడుబిడ్డను వివాహము చేయక వదలుట కొందఱి వీరశైవులలో నిప్పటికిని కలదు. వారు వ్యభిచారపు వృత్తిచే జీవింతురు. వారికి బసివి యని పేరు కల్గినది. తాతాచార్యులవారి వైష్ణవము రాకమునుపు ఈ యాచార ముండెను. వైష్ణవ గురువులు శిష్యులలో బసివిరాండ్రకు భస్మ రుద్రాక్షలకు తిరుమణి తులసిపూసల నిచ్చి దాసర్లగుంపులో వారిని చేర్చినారు. (అనంత కృష్ణశర్మ-వేమన.)

వేమన కాలములో చిత్రములు వ్రాయుట కొంతయైన నుండినట్లు కాన వచ్చును. "చిత్తరువు ప్రతిమ కైవడి చిత్తమ్మును గల్ప మడచి చిరతర బుద్ధిన్" అని వర్ణించెను. మరియు,

           "ఇంగిలీకమహిమ హేమింపనేరక
            చిత్రపటము వ్రాసి చెరచినారు."

అనియు వ్రాసినారు. ఇంగిలీకాన్ని చిత్తరువుల రంగులకు వాడినారు, వేమన కాలములోని ఆయుర్వేద దేశీయవైద్య మెట్లు సాగెనో కొంతకొంత జాడ కానవస్తున్నది.