శక్తిలేకున్న నిట్టివేషంబు పూను
మన్న సురలోకవంద్యుడవైన నీవు
నీచులకు సలాంసేయ నే సహింప॥
'వైరి"..."
తురకలు చేసిన దౌష్ట్యములను యిట్లు వర్ణించినాడు:-
'కనిపించు కోవుగా ఖలులు మార్గస్థుల
కొంకక ముక్కులు గోయునపుడు
ఆలకింపవుగదా యయ్యయో ప్రజఘోష
ధూర్తులు వడి నిళ్ళు దోచునపుడు
జాలిగాదాయెగా చటులతురుష్కులు
భామినులను చెరల్ పట్టినపుడు...."
మరియు:-
గ్రామముల్ నిర్దూమధామమ్ము లయ్యెను
సస్యంబు లెల్ల నాశనము చెందె
దొడ్లలో శాకముల్ దుంపశుద్ధిగ బోయె
దోచిరి సర్వంబు గోచిదక్క
తురకదండు సింహాద్రిపైకి వెళ్ళగా అక్కడ తుమ్మెదలదండు వచ్చి వారిని కరచి పారిపోవునట్లు చేసెనని అట్టి తావును తుమ్మెదల మెట్ట అందురని కవి వర్ణించి ఒక పద్యాంతమందు ఇట్లు దేవుని సంబోధించినాడు :-
"(కాక) రోషంబు గలిగిన కఠినయవన
సేన నిర్జించి యీ యాంధ్ర సృష్టి నిలుపు"
(ఇక్కడ సృష్టి అనగా (culture). సంస్కృతి అనే అర్థమును నేను గ్రహిస్తున్నాను. అదే కవిభావ మనుకొందును.)
కాంచీ నగరవాసియగు వెంకటాధ్వరి క్రీ.శ. 1600 ప్రాంతమువాడని యందురు. బహుశ 1650 ప్రాంతమువాడై యుండును. అతడు వ్రాసిన విశ్వగుణాదర్శనము అను సంస్కృత కావ్యములో కూడ తురకలు చేసిన ఘోరాల నిట్లు వర్ణించినాడు. తెనిగించిన భాగాలే యుదహరింతును.
.