పుట:Andrulasangikach025988mbp.pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యాలను ద్వంసము చేయుచు వీరవిహారము చేసెను. వారి దుండగాలను కవి యిట్లు వర్ణించెను.

          "ఎలమితో సోమయాజుల పెద్దఝారీలు
           గుడిగుడీలుగా జేసికొనెడివారు
           యజ్ఞవాటికలలో నగ్ని హోత్రంబుల
           ధూమపానము చేసి త్రుళ్ళువారు
           యాగపాత్రలు తెచ్చిహౌసుగా, వడి,
           లుడికి చిప్పలుగ జేసి కేరువారు
           స్రుక్స్రువముఖ్యదారుమయోపకరణముల్
           గొని వంటపొయినిడుకొనెడివారు
           నగుచు యవనులు విప్రుల దెగడుచుండ
           సవనభోక్తపు నీవిట్లు సైపదగునె
           తినదినగ గారెలైనను కనరువేయు
           వైరిహరరంహ సింహాద్రి నారసింహ!"

(ఝారీలు=ఝరీవలె ధారపడు నాళముకల చెంబులు ఉర్దూలో టూటీదార్ లోటా అందురు. గుడిగుడీ=హుక్కా.)

ఆ కాలపు తురకల వేషా లెట్లుండెనో పై కవియే వర్ణించినాడు. నరసింహస్వామిని తన హిందూవేషమును మార్చుకొని తురకవేషము వేసుకొమ్మని యిట్లు సంబోధించుచున్నాడు :-

          "జడవిప్పి జులుపాలు సవరింపు మిరువంక
           బలుకిటికీదారు పాగ జుట్టు
           బొట్టునెన్ను దుటిపై బొత్తిగాతుడుచుకో
           పోగులూడ్పుము చెవుల్ పూడవిడువు
           వడిగ నంగీ యిజార్దొడుగు దట్టీ జుట్టు
           కైజారుదోపు డాల్కత్తి బట్టు
           బీబినాంచారిని బిలిపింపు వేగమే
           తుద కభ్యసింపుమీ తురక భాష