పుట:Andrulasangikach025988mbp.pdf/339

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(భ్రమపడి బోగంవాడని తెలియక) ఉదాహరించెను. ఈవిధముగా ఇతడు సారస్వతాని కపచారము చేసెను.

10. గండికోట ముట్టడి:- గ్రంథకర్తపేరు తెలియదు. ఇదొక లఘుపుస్తకము. 15 ఏండ్ల క్రిందట నేమో సమదర్శిని కార్యాలయమందేమో ప్రకటించిరి.

11. వేంకటనాథుడు - పంచతంత్రము :- తన వర్ణనల నన్నింటిని ప్రజాజీవనము నుండి గ్రహించి తన లోకానుభవమును, హాస్యప్రియత్వమును, ఉభయ భాషా వైదుష్యమును, ఉత్తమ కవితను ప్రకాశింపజేసిన మహాకవి వేంకటనాథుడు. సంస్కృత మూలములో లేని కథలను, వర్ణనలను చాలా పెంచినాడు. లక్షణ విరుద్ధ ప్రయోగము లతని కవితయందు కలవని శ్రీ వీరేశలింగం పంతులుగా రన్నారు. ఈతని కవి తప్పులని తెలియక కాదు. వాటిని లెక్క పెట్టక భావమునకే ప్రాధాన్య మిచ్చిన వాడు. కవి కృష్ణా గోదావరిజిల్లాలలో నేదేని యొక జిల్లావాడై యుండును. వేము (1-115) అధాటున (3-163) అను పదాల ప్రయోగమును బట్టి అనుమానించుటకు వీలు కలుగుతుంది. రాచవారుకూడా ఆ జిల్లాల వారే. ఈతని కవిత ఉత్తమశ్రేణిలోనిది. సాంఘిక చరిత్రకు చాలా పనికివచ్చునట్టిది.

12. వెలుగోటివారి వంశావళి (మద్రాసు యూనివర్శిటీ ప్రచురము).