పుట:Andrulasangikach025988mbp.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బలిగాడంటిని. మహారణరాజు రణపోతరాజు ఒకటేయై యుండును. పోతురాజుకు దున్నపోతులు చాలా ఇష్టమన్నమాట. వెలమరాజుల కాలములో విజృంభించిన యీ యాచారములు నేటికిని మన పెద్ద దేవరలో నిలిచి పోయినవి. విష్ణుమాయా నాటకము అను ప్రబంధముయొక్క పీఠికలో నిట్లు వ్రాసినారు. 'శివునికి మోహినికిని పుట్టినవాడు శాస్త అనువాడే ఫొతరాజు.' శాస్త అను దేవత నేటికిని మళయాళ దేశమందు ప్రజలచే పూజలందుచున్నాడు. మళయాళీలు, అరవలు, శస్తన్ లేక చాత్తన్ దేవతయని ఇతనిని పూజింతురు. శాస్త కథ స్కాందపురాణాని కెక్కినదట!

తాతాచారి ముద్ర :-

ఈ కాలములో శైవవైష్ణవ ద్వేషాలు విశేషమయ్యెను. అద్వైతి యైనను శైవమందే అత్యభిమానము కల అప్పయ దీక్షితులు భరతఖండ మంతటను ప్రఖ్యాతుడై 104 గ్రంథాలు రచించి శైవము నుద్దరించిన వాడని విశ్రుతుడయ్యెను. అదేకాలములో శ్రీకృష్ణదేవరాయ అశియ రామరాజ చక్రవర్తులకు దీక్షాగురువై వారికిని తన వీరవైష్ణవము కొంత యెక్కించిన తాతాచార్యులు అ సేతు వింధ్యాచలము వైష్ణవమతవ్యాప్తిని జేసి బలవంతముగాకూడ శైవులను వైష్ణవులనుగా మార్చెను. అట్టివారి నెందరినో మరల అప్పయ దీక్షితులు శైవులనుగా జేసెను. తాతాచారి బలవంతపు దీక్షను పురస్కరించుకొని తెలుగు దేశములో 'తాతాచారివారి ముద్ర యెక్కడ తప్పినా వీపున దప్పదు' అను సూక్తి యేర్పడెను. కొందరు 'మరింగంటి వారి ముద్ర' అని పైవిసూక్తిని చెప్పుదురు. మరింగంటివారు నేటికిని తెలంగాణమున నిండుగా తామర తంపరగా నున్నారు.

అప్పయను అప్పై అనియు, అప్పాదీక్షిత అనియు పేర్కొనిరి. అతడు తమిళుడు కాని తెనుగు చక్రవర్తులను నాయక రాజులను ఆశ్రయించిన వాడగుటచే తెనుగు నేర్చియుండెను. అందుచేతనే ఆత డిట్లనెను.

         "ఆంధ్రత్వ మాంధ్రభాషాచ.............
          నాల్పస్య తపస:ఫలం'

అతడు క్రీ.శ. 1520 నుండి 1593 వరకు జీవించెనని వై. మహాలింగ శాస్త్రిగారు నిర్ణయించిరి. అప్పయ దీక్షితుల జన్మస్థానము "అడైయపాళెం."