'డాకాలిగండ పెండారంబుదాపున
బొమ్మలై వైరి భూభుజులు వ్రేల
నిండుకొలువుండె కన్నుల పచు
విభవుడల్లాడ భూసతి వీరవిభుడు'
ముసల్మానులు చేసిన చేయుచుండిన బీభత్సములనునైన తలపక రెడ్డి వెలమరాజులు పరస్పరము ద్వేషించుకొని యుద్ధాలు చేయుచుండిరి. ఒకరి నొకరు చంపుకొని వారి యాకారములుకల బొమ్మలు చేయించి తమ్మ పడిగలలో పెట్టించిరి. తమ బిరుదు గండ పెండారపు పగ్గాలకు శత్రువుల బొమ్మలను చేయించి కట్టించి అవి తమ మోకాళ్లవద్ద వ్రేలాడునట్లు చేసిరి.
వెలుగోటివారి వంశావళి (నేలటూరి వేంకటరమణయ్యగారి మద్రాసు యూనివర్సిటీ ఎడిషన్) నిండుగా బొమ్మ పెట్టుట బొమ్మ కట్టుట కాననగును.
"కొమ్మని మచ్చ యౌబళుని గూల్చి శిరంబులు ద్రుంచి గన్నయన్
పిమ్మట ద్రుంచి, తత్సుతుల బేర్చిన బొమ్మలు వెట్టి దారులన్
దమ్మటముల్ వెసంగొనియె దాచయసింగని పట్టి యెట్టిడో
బొమ్మలు వెట్టునిట్టు లనపోతడు వైరము బూనువారికిన్ (ప. 63),
"అ కొమార వేదగిరి నేడే యనవేమారెడ్డి తమ్ముని మాచారెడ్డిని గొట్టి తమ్మ పడిగాన బొదిగించిన, నా యనవేమారెడ్డి పిన వేదగిరిని జంపి తమ్మపడిగాన బొదిగించెను.
"వెక్కసంబగు యుద్ధంబుజేసి యనవేమారెడ్డిని గొట్టి తామ్మపడి గాన బొదిగించి సింహతలాట బిరుదును, దనచేత శ్రీనాథు డడిగికొంచు బోయిన నందికంత పోతరాజు అను కఠారిని బుచ్చుకొనెను." (ప. 107)
"కొమర గిర్రెడ్డికి కోరి సింగయమాదు
తనర బెట్టిన బొమ్మ తలపవైతి. (ప. 108)
ఈ బొమ్మకట్టుట, బొమ్మ పెట్టుక అను నాచారము తెనుగు వారిలోనే విశేషముగా గానవచ్చును. అది క్రీ.శ. 1200 నుండి (నాచన సోమునకు కొంత ముందు కాలమునుండి ఏర్పడినట్లున్నది.)