పుట:Andrulasangikach025988mbp.pdf/332

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

         2. రాతినాతిజేసి పురారాతి చేతి విల్లువిరచి
            భూతలేంద్రులెల్ల మెచ్చగా-ఓరామచంద్ర సీతను వివాహమాడవా.

లిపులను గురించి యొకమాట. నన్నయనాటి లిపిని ఈనాడు పట్టుమని పదిమందే చదువగల్గినవారు. కాకతీయకాలమునుండి శ్రీనాథుని కాలమువరకు మనలిపెవలె కొద్దిగా కళవచ్చినను తెనుగులిపి పరిణామావస్థలోనే యుండెను. పొక్కిలి శ్రీనాథుని కాలమువరకు కని పెట్టబడలేదు. క్రీ.శ.1500 తర్వాతనే అది ఏర్పడినది. అప్పకవి కాలమువరకుకూడ తెనుగులిపి మారుచుండెను. అప్పకవీయము ద్వితీయాశ్వాసములో 'దరశార్జ్గపిప్పల' సూత్రమున్నూ దాని తర్వాతి సూత్రమున్నూ హల్లుల స్పర్శరూపాలను స్వరగుణితమును తెలుపునవి. అవేటివో అర్థమగుటలేదు. పూర్వమువారికిని అర్థమైనట్లు తోచదు. అందుచేతనే వావిళ్ళవారి ముద్రిత ప్రతిలో 'ఈ ప్రాతలిపులు ప్రతిపుస్తకమున వేరువేరుగా నుండుటంజేసి వీరి కుదిరిక చక్కగా తెలియబడదయ్యె' అని వ్రాసినారు. నన్నయకు పూర్వము 200 ఏండ్లకు ముందునుండి శాసనాలు దొరకుతున్నవి. కావున ఇంచుమించు (క్రీ.శ. 800 నుండి నూరేండ్ల క్రిందటినుండి ముద్రణ ప్రారంభమగువరకు అక్షరాలెట్లు మారుతూ వచ్చెనో వాటి సమగ్ర చరిత్రను నిపుణులు వ్రాయుట చాలా అవసరము. అప్పకవి వ్రాతప్రతులు వీలైనన్ని సేకరించి అతని భావమేమో కనుగొని సరిగా ప్రకటింపవలెను. తెనుగులిపి సంస్కృత లిపినుండి యేర్పడినది. కావున ఆరూప పరిణామ మెట్లయ్యెనో తెలుపవలెను. తమిళమునుండి 'ఱ' యొక్క పూర్వరూపమును తీసుకొని దానిని డ, ళ, ఱ, ధ్వనులనుగా మార్చుకొన్నాము. ఎ, ఒ, చ, జ, లు ప్రాకృతమున కలవు. మహారాష్ట్రమున వాడుకలో నున్నవి. ఈ విషయాలన్నియు సమగ్రముగా చర్చించవలెను. అనగా ఒక ప్రత్యేకోద్గ్రంథ మవసరము.

ఈ ప్రకరణములు ముగించుటకు పూర్వము శుకసప్తతిలోని కొన్నిపదాలను గూర్చి మాసరకై తెలుపుదును కొన్ని యీ ప్రకరణములో నిదివరకే తెలిపినాను. శుకసప్తతిలో కొల్లలుగా నిఘంటువులలో లేని పదాలు కలవు. సీతారామాచార్యులుంగారు దానిని వద్ద నుంచుకొని తమకు తెలిసినవి మాత్ర ముదాహరించి తక్కిన శతాధిక పదాల నుదాహరింపకయే వదలి వేసినారు. వాచస్యత్యమందును అంతే! సూర్యరాయాంధ్ర నిఘంటులో సహితము చాలా