పుట:Andrulasangikach025988mbp.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

         "బడిపనులవారి గొల్లల గుడినంబుల జంగవరుస గొని చేకొలదిన్
          బడిమారు త్రిదండమున నెడమ కుడిన్ నారసింహ మెత్తినరీతిన్.
          ఇట్లు కోలాహలంబుగా పెట్లబెట్టి వీక నందర నచట వొయ్యాకచేసి"[1]

బాధించెడివారు. (బడిపనులవారు, జంగవరుస, బడిమారు అను పదాలకు నిఘంటువులలో అర్థాలు లేవు. బయ్యాకనో, నొయ్యాకనో దీనికిని అర్థము లేదు.

దొంగ దొరికిన తర్వాత సాక్షులతోసహా తలార్లు, వారి అధికారులు దొంగను 'సభ'లో విచారణకు తీసుకొనిపోదురు. సభాసదులు గ్రామముఖ్యులే! వారు సాధారణముగా ధర్మశాస్త్రాలు, వేదాలు తెలిసిన బ్రాహ్మణులుగా నుండవలెను. వారు తమ పంచాయతీ సభను ఊరుమధ్యనో, ఊరిముందో, దేవాలయముముందో ఉండు రచ్చకట్టపై చేయుదురు. గ్రామ జనులున్నూ వచ్చి ప్రక్కను కూర్చుని విచారణను వినెడివారు. పంచాయతి విచారణ యెట్లుజరిగెనో విప్రనారాయణుని విచారణ నుదాహరణముగా తీసికొనిన తెలియరాగలదు. రంగనాథుని గుడిలో బంగారుగిన్నె దొంగతనమయ్యెను. ఒక కంసాలి అది బోగముదానియింట కలదని జాడ తెలిపెను. కత్తులు కట్టెలు పట్టుకొని తలార్లు దానియింటి కేగి 'పరివారజననివహంబునం దద్గృహంబు శోధీంపందగు, వారిబనిచినం జని వారును' ఇల్లంతయు వెదుకగా ఒకచోట చందనపు పెట్టెలో గుందనపు గిన్నెను తీసి తలవరియెదుట బెట్టగా వారు గిన్నెను, బోగముదానిని తీసుకొనిపోయిరి. అప్పుడు బోగముదానితల్లి 'అయ్యా! మాకు దీనిని విటు డొక డిచ్చెను. వాడు మా యింట నున్నా'డని యనెను. అన విని యత్తలవరి యతనిం దోడితెండని నిజభృత్యులం బనిచినం జని వారలు విప్రనారాయణునిం గనుంగొని,

          దండము దండ మి దెవ్వరు తొందరిదిప్పొడులు గిన్నె దొంగైనారో!
          రండిట!! వేంచేయుం డిదె దండ మిడన్ వచ్చినాడు తలవరి మీకున్,
          అని బహువిధముల సోల్లుంఠనముల నాడుచును దొంగనాసామీ! గొ
          బ్బున వేంచేయుం డనుచును జని యతనిం జియ్యగారి సమ్ముఖమునకున్.

"తోడ్కొని చని యత్తలవరి వారల నక్కనకపాత్రంబుతో జియ్యల కొప్పించిన నతండు వేశ్యం గనుంగొని యగ్గిన్నియ మీకు నేక్రియం జేరె, నెరి

  1. వైజయంతి. 4-65, 66.