లికుచ కుచవేషమేకాన యకట:
దాని యొరపులేదని యాత్మలో పరితపించు"[1]
రెడ్డి స్త్రీ:-
పై పద్యములో కొంత తెలియవచ్చినది, మరికొన్ని విశేషములు గమనింపదగినవి:-
"గొంటుపూసలు రెండుగుండ్ల ముంగరలు,
మైజారుచీరలు పెన సన్నగొలుసు
పెద్దమట్టెలు మట్టిపిల్లాండ్లు, బొబ్బిల
కాయలొత్తులతోడి కడియములును
కప్పు పల్వరుస లుంగరములు తూలెడు
కొంగులు బలు చెంప కొప్పులంచు
కమ్మగవల్ సన్న కాటుక రేఖలు నాభినామంబులు నానుచుట్లు
పసుపుపూతలు......బిగువు రవికెలు........"[2]
కలిగియుండిరి. పై పద్యములో బొబ్బిలికాయలు నిఘంటువులలో లేదు. కాలి మూడవ వ్రేలి మట్టెలను బొబ్బిలికాయ లందురు.
జంగమురాలు:-
మర్రిపాలుపూసిన జడలదిండు. చింతాకంత విభూతిరేఖ, సందిట రుద్రాక్షపూసలు, నాగబెత్తము, తామ్రపు నందిముద్ర యుంగరము, జన్నిదపు వాటు, యోగపట్టె కలది.[3]
ముత్తైదువులు:-
ఆ కాలపు ముత్తైదువలు పసుపు పూసుకొనిరి. కాటుక పెట్టిరి. పత్తి బొట్టు పెట్టిరి.[4]