పుట:Andrulasangikach025988mbp.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

        "మరులు దీగ మెట్టి యిరులన్న నోయనియెడు తమిస్రగాడు పడి పొలము
         లెల్లదిరిగి తూర్పు తెల్లనౌ తరినొక్క శూన్య గహనవాటిజొచ్చి చనుచు"[1]

మరులు తీగెను మర్లుమాతంగి యని యందురు. అదొక అలుము, సన్న ఆకు లుండును. దానిపండు గురిగింజంత ఎర్రగానుండును. దానిలో రెండుచిత్తులు దోసవిత్తులవలె నుండును. అ రెండు విత్తులు ఒకే దిక్కుననుండును. ఒకదాని కొకటి ఎదురుగా వేరు వేరు దిక్కుల మొగమైయుండును. ప్రియులను కూర్చుటకును తాంత్రికులు దీనిని వాడుదురు. దీన్ని గురించి ఆయుర్వేద వైద్యులెరుగుదురు. భర్తలు భార్యలపై ప్రేమ లేనివారైన వారిని వశీకరించుకొనుట యంత్ర మంత్ర తంత్రాలను సేవించి వశీకరణ మూలికలనుగొని భర్తలను భోజనమందు కలిపి తినిపించి పలుమారు వారిని తెలియక చంపుకొనెడి స్త్రీలు కొంద రానాటినుండి యీనాటివర కుండిరి. సంస్కృతాంధ్ర భారతములందు పాండవుల యరణ్యవాస కాలమందు ద్రౌపది భర్తల వశీకృతి కాశ్చర్యపడి సత్యభామ యామెను వశీకరణపు మణి మంత్రౌషధము లేవియో తెలుపుమని యడిగినట్లు వర్ణించినాడు. దీన్నిబట్టి స్త్రీల వశీకరణ ప్రయోగము లతి ప్రాచీన భారతీయ యోగములే యనవలెను. వాత్స్యాయనుని మొదలుకొని తర్వాతి కామశాస్త్ర ప్రవర్తకులందరును వశీకరణ యోగాలను గురించి వ్రాయనే వ్రాసిరి. కాని ఇవెందును పనిచేసినట్లు నిదర్శనములే లేవు. ఉన్న నిదర్శనాలవలన భర్తలు వశీకృతులగుటకు మారుగా భస్మీకృతులైరనియే తెలియవచ్చినది. రుక్మాంగదలో నిట్లున్నది:-

         'పతి నను నొల్ల డవ్విభుని బాయుట కోర్వగ జాల నక్కటా
          గతియిక నాకు నెద్గి గజగామిని యానతి యిమ్మటంచు రు
          ర్మతమున సిద్ధురాలికి క్రమంబున జెప్పిన చెట్టుయందు నీ
          పతికిది పాలతో నిడుము భర్తవశుండగు నంచు బల్కగన్‌'

'వలపు మందిట్లిడ మొక్కలమున పతి సమసె..........(3 - 239)

బ్రాహ్మణులు శిరస్స్నానము చేయునప్పుడు ఇప్పపిండిని రుద్దుకొనిరి.[2]

  1. ..... ...... ...... 6 - 12.
  2. ఆముక్త మాల్యద, 1 - 83.