పుట:Andrulasangikach025988mbp.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

(ధారణ అను పదమును హిందీలో దారణ్ అందురు. అనగా ధర. ధారణ వాసియన, ధరలో ఎచ్చుతచ్చులు లేక ధాన్యమునకు పైక ముదర. మరియు పైకానికి ధాన్యం ధర కట్టుట. మిట్ట అన రచ్చ కట్ట పంచాయతిని గురించి ముందు వ్రాయదుము.)

పరాశరమాధవీయములో హరహరరాయలు పన్నులను నాణెములలో చెల్లింపవలెనని యాజ్ఞ యిచ్చినట్లు తెలియవస్తున్నది. అనగా అంతకు ముందు జనులు పన్నును ధాన్యరూపముగా కూడా చెల్లించి రన్నమాట. నాణెము లన్నింటిపై వరాహ లాంఛనమే యుండెనని తలపరాదు. రాజులు తమ చిత్తము వచ్చినట్లుగా లాంఛనముల మార్చిరి. విజయనగర నాణెములపై హనుమంతుడు, గరుడుడు, ఎద్దు, ఏనుగు, ఉమామహేశ్వరుడు, వేంకటేశుడు, బాలకృష్ణుడు, దుర్గ, లక్ష్మీనారాయణులు, రాముడు, శంఖ చక్రాలు లాంఛనాలుగా ముద్రింపబడెను.

నాణెములను గుంజల లెక్కప్రకారము ముద్రించిరి.

ఈక్రింద నాణెములు ముఖ్యమై నట్టివి.

బంగారువి:- గద్యాణము (వరహాలు), ప్రతాపలు (వీటినే మాడలు అనిరి.). పణము, కాట, హాగ.

వెండివి:- తారము, చిన్నము.

రాగివి:- పణము, జీతల్, కాసు మున్నగునవి.

రెండవ దేవరాయల నాణెములను గురించి అబ్దుర్రజాఖ్ అను ఈరానీ రాయబారి క్రీ.శ. 1443 లో ఈ విధముగా వ్రాసెను.

            నాలుగు కాటీలు ఒక వరహా.
            వరహాలో సగము ప్రతాపము.
            ప్రతాపలో పదవభాగము పణము.
            పణములో ఆరవభాగము తారము.
            తారములో మూడవభాగము నాణెములు.

         "సాధారణముగా వరహా 52 గుంజల ఎత్తుండెను."