పుట:Andrulasangikach025988mbp.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చార్యులును నీవిధముగ ప్రజల బాధించుటవల్ల హిందువులలో పరస్పర ద్వేషాలు, రాజద్రోహ, దేశ ద్రోహ బుద్ధి ప్రబలుటలో నాశ్చర్యము లేదు.

కాళహస్తీశ్వర శతకమును ధూర్జటి వ్రాసెనందురు. శైలిని బట్టి అదీ తనది కాదని చెప్పవచ్చును. దాని నెవరు రచించినను అది యీ సమీక్షా కాలపుదిగా కానవచ్చును.

అందు విష్ణుదూషణములు మెండుగా గలవు. "నీపాదపద్మంబుచేర్చె న్నారయణు డెట్లు మాననము దా శ్రీ కాళహస్తీశ్వరా!", "శ్రీ లక్ష్మీపతి సేవితాంఘ్రి యుగళా శ్రీ కాళహస్తిశ్వరా!" "శ్రీరామార్చిత పాదపద్మ యుగళా శ్రీకాళహస్తీశ్వరా!" అని దూషించెను. ఇట్టి తిట్టులను విని శ్రీవైష్ణవు లూరకొందురా? వారును కొన్ని కథలను కల్పించి శివునిచేతను విష్ణుపాదముల బట్టించిరి. పరమయోగి విలాసమున తాళ్ళపాక తిరువేంగళనాథుడు కొన్నితావుల శివదూషణము చేసెను. ఈ ద్వేషము లెంతవరకు పోయెననగా, శైవవిష్ణువులు పరస్పరము చండాలు రనియు, పాషండు లనియు, పాపు లనియు తిట్టుకొని సచేల స్నానాలు చేసిరి.

తమ సాంప్రదాయములో చేరినవారు కులము చెడి, వ్యభిచారులై, దొంగలై, మద్యపాయులై, హంతకులైనను సరే, తమ వేల్పుపై భక్తి కలవారేని లేక భక్తి యున్నట్లు నటించినను సరే, వారికి ముక్తినిచ్చిరి. ముక్తి ధామములు కూడా వేరెవేరె యుండెను. శైవులు కైలాసానికి, వైష్ణవులు వైకుంఠానికి పోయిరి. ఇప్పటికిని పోతూనే వున్నారు. తమ సాంప్రదాయక దేవతలతో ఎన్నెన్నో నీచపుబనులను చేయించిరి.

మ. నిను నావాకిలి గావుమంటినొ, మరు న్నీ లాలకభ్రాంతి గుం
           టెన పొమ్మంటినొ, యెంగిలిచ్చి తిను తింటేగాని కాదంటినో,
           నిను నెమ్మిం దగ విశ్వసించు సుజనానీకంబు రక్షింప జే
           సిన నావిన్నప మేల కైకొనవయా శ్రీ కాళహస్తీశ్వరా;

అనియు,

"నిన్నే రూపముగా భజింతు మదిలో నీరూప మోకాలో; స్త్రీ
           చన్నో, కుంచమొ, మేక పెంటికయొ ..........?"