"అగ్రహారములు విద్యా తపోవృద్ధ వి
ప్రుల కిచ్చి యజ్ఞక ర్తలుగ నునిచె
కొమరార చెరువులు గుళ్ళు ప్రతిష్ఠించి
లోకసంభావ్యంబులుగ నొనర్చె
నిధులు నల్గి డ్లును నిలిపె, తోటలు సత్ర
ములు చిలివిందరల్ వెలయ బెట్టె
హేమాద్రిపరికీర్తి తావితదాన
నివహంబు లన్నియు నిర్వహించె
చేసె, చేయుచునున్నాడు సేయనున్న
వాడు, పునరుక్త కృతి శుభావలులనెల్గ
ననగ శ్రీ వేమవిభున కయ్యలరు పేర్మి
వశమె వర్ణింప తద్బాగ్య వైభవంబు."
వెన్నెలకంటి సూరకవి యిట్లనెను.
"తన బ్రతుకు భూమిసురులకు
తన బిరుదులు పంటవంశ ధరణీశులకున్
తన నయము భూమి ప్రజలకు
అన వేమన యిచ్చె కీర్తి విభవుం డగుచున్.
ఒక పౌరోహితుని జీవనమును జుగుప్సాకరముగా గౌరన తన హరిశ్చంద్రలో వర్ణించెను. "రోగులవలన కొంత లాగి, బ్రేతవాహకుడై కొంత గడించి, గండశాంతులందు, సప్తకము లందును (ఏడుగురిను పిలిచి పెట్టు శ్రాద్దము లందును) తృప్తాప్తగా భుజించి, గ్రహణ కాలములో ఒక మాడయైన దక్షిణగా పొంది, ఇంటింట పంచాంగ పఠనము చేసి, అయవారము లెత్తి, దానము పట్టిన ధాన్యాలను తన వస్త్ర మందు మూల మూలలందు మూటలుగా కట్టి, ఏమిలేనినాడు కరతిత్తిపట్టి, ముష్టియెత్తి, కూడబెట్టిన పైకాన్ని అప్పుల కిచ్చి పత్రాలు వ్రాయించుకొని వృద్ధి, చక్రవృద్ధి, మాసవృద్ధి అని వడ్డీలు గడించి, ఒక పౌరోహితుడు జీవించెనని వర్ణించెను." (పుట 145, 146. రెండవ భాగం - వేదం ప్రచురణము.)
అప్పులు తీసుకొనువారిపాట్లను, అప్పుల ముంచే పద్ధతులను గౌరన చాలా చక్కగా వర్ణించినాడు.