పుట:Andhrula Charitramu Part 2.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కామచోడదేవ మహారాజు.

ఇతని పేరిటనే కొట్యదొనయందు కామేశ్వరాలయము నిర్మింపబడినది గాని యదియు నిపుడు గానబడదు. ఇతడు శా.శ.1059వ సంవత్సరముకు సరియైన క్రీ.శ.1137వ సంవత్సరమున కొట్యదొనలోని బల్లీశ్వరాలయమునకు భూదానము చేసినట్లుగ నా పట్టణములోని శంకరస్వామి యాలయమండపము మీది యొక స్తంభముపై దానశాసనము గాన్పట్టుచున్నది. శా.శ.1085వ సంవత్సరమునకు సరియైన క్రీ.శ.1161వ సంవత్సరమున శ్రీయదేవి పై దేవాలయమునకు భూదానము చేసినట్లుగ గన్పట్టుచున్న శాసనములో శ్రీయదేవి కామచోడమహారాజుయొక్క పట్టమహషియని చెప్పబడియున్నది. ఆ సంవత్సరముననే చేయబడిన మరియొక భూదానశాసనములో శ్రీయదేవి బల్లయచోడ దేవమహారాజునకు గోడలని చెప్పబడి


[1]

  1. బర్వనిట్టూర్పులు పట్టువ బడవొండె,
    బొందిమ్ముగా బాసి పోవ దొండె,
    నిట్టి కడలేని దుఃఖాబ్ధిబెట్టి ముంప
    దలచియో కాక పోనీక బలిమి నాదు
    ప్రాణమొడలిలో నాకాశవాణి దెచ్చి
    మగుడ జెరబెట్టెనని రతిమగుచుండె.“
    వీరపురుషులు యుద్ధమునకు వెలువడుచుండ నొక వీరపత్ని పచ్చవలువయు, గంఠమాల్యములును, వీరమద్దియలును ధరించి నిశ్చిత హృదయుండగుపతిం గనుంగొని చెప్పుచున్నది.
    ఉ.ఓలములేదు కూర్చునని యోరడియుండితి గూర్మియెల్ల నే
    డాలముచేసి నన్ను బెడయాకులబెట్టె మనఃప్రియుండు త
    న్నాలములోన బెట్టి దివిజాంగనలం గలయంగ నెత్తెనే
    నాలనె బేలగాక చెలియాయని నెచ్చెలిమీద వ్రాలుచున్.“