పుట:Andhrula Charitramu Part 2.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2 ఆంధ్రులచరిత్రము.

ద్రావిడాంధ్ర దేశములు పూర్వచాళుక్య చోడ సామ్రాజ్యమునకును, కళింగోత్కలములు కళింగగాంగ సామ్రాజ్యమునకును లోబడియుండినవి. ఆంధ్రభారత కృతిపతినగు మొదటి కులోత్తుంగచోడదేవుని చరిత్రమాంధ్రదేశమునకు సంబంధించినంత వరకు నాంధ్రులచరిత్రములోని బ్రథమభాగమున సవిస్తరముగా దెలిపియున్నాడను. [1]

ఇతడు క్రీ.శ.1070 మొదలుకొని 1118వ సంవత్సరము వరకు బరిపాలనము చేసెను. ఇతడు శివభక్తుడై శైవమతాభినివేశ పరవశుడై శివాలయములను బెక్కింటిని నిర్మించి ప్రఖ్యాతినొందినను, పరమత సహనము లేనివాడని చెప్పుదురు. ఆ కాలమునందలి బ్రాహ్మణులప్పటికే శివుని దైవముగానంగీకరించనవారగుటచేత ఇతడు బ్రాహ్మణద్వేషిగాక యుండెను. ఆ కారణముచేత నీతనికాలమున బ్రాహ్మణమతము వర్థిల్లుచుండెనని చెప్పవచ్చును. ఆ కాలముననే ఆర్యబ్రాహ్మణమతమనేక సంస్కారములనుబొందెను. దక్షిణాపథమునకు వచ్చిన యార్యబ్రాహ్మణులు ద్రావిడులతో సంపర్కమువలన శివారాధనమవలంబించినవారయినను వారికి ప్రధానమైన వైదికమతమే ప్రధానమతముగనుండెను. ఈ మతమును బ్రకాశింపజేసినవాడు కుమారిలభట్టు. ఈ వైదికమతోద్ధారకుని చరిత్రమును సంగరహముగా నాంధ్రులచరిత్రములోని ప్రథమభాగమున దెలిపియున్నాను గావున, నిచ్చట మరల దెలుపలేదు. [2] కుమారిలభట్టుచే బ్రకాశింపబడిన కర్మప్రధానమైన వైదికమతము నానాట వర్థిల్లుచుండినను, కుమారిలభట్టుయొక్క ప్రతిపక్షులయిన జైనబౌద్ధమతాచార్యులతో వాగ్వాదము సలిపి విజయము గాంచినను, ప్రజాపాలనము సేయు మహారాజులను వశులనుగ జేసికొని యెన్ని విధములుగా జైనులను బాధించి హింసించినను, అతనిచే బోధింపబడిన మతము ప్రజారంజకముగ నుండకపోయెను.

  1. ఆంధ్రులచరిత్రము; ప్రథమ భాగము. 309_324 పుటలు
  2. ఆంధ్రులచరిత్రము; ప్రథమ భాగము. 248 పుట