రనియు, అట్లే నన్నెచోడుడు కూడ తన కుమారసంభవమున ముప్పదియారలంకారముల బేర్కొనియున్నవాడనియు,
కాబట్టి పై హేతువులచేత నన్నెచోడకవి నన్నయభట్టారకునకు బూర్వుడని చెప్పుచున్నారు. ఇప్పటికీ విషయమున నాకే సిద్ధాంతమును స్థిరపడియుండలేదు. ఇంకను బరిశీలింప వలసి యున్నదని నా యభిప్రాయము.
కాకతి రుద్రాంబ కాకతిగణపతి దేవచక్రవర్తి కూతురు కాని భార్య కాదని మల్కాపురశాసనముం బట్టి సిద్ధాంతపరచి యున్నాను. మల్యాల గుండయ దండనాథుని బూదువూరు శాసనములో గూడ రుద్రదేవుడను పేరుతో రాజ్యము చేసి రుద్రాంబిక గణపతి కూతురనియె యీ క్రింది శ్లోకములలో సూచింపబడియెను.
"తస్యాతిశస్యః క్షితి పోషదక్ష స్సదా స్వకె ()ర్మణి ధర్మమూతె
సుతస్సమాసీ దసమాన భూతిర్భూవల్లభః శ్రీగణపాభిదానః
శత్రూ నాశు పిపేష వీరనిరతా న్బంధూ న్పుపోసాత్మనో
దారే ష్వేవతుతోష నిత్యవిలసన్నీ త్యోన్మిమేషాక్షిణీః
(స)ద్ధర్మం విశిశేష యః పరహితం తోషాది యేష ప్రభు
తద్రాజభుని సద్భద్రముద్రే రుద్రమహీపతౌ
అస్మే న్విస్మితవిక్రాంతౌ గుర్వీముర్వీ మ్ప్రశాపతి