ఱను బేర్కొనియుండుటచేత గొంతవఱకు చరిత్రము బోధపడుచున్నది. ఈశాసనములో:-
"శృజ్గత్తుల్గపుజ్గననయారోహక్రమే కర్మకం
దోమ్మంచరుపరాక్రమక్రమణ్భరం భక్త్క్యాసకృల్లీలయా
కర్ణ్ంపార్ధఇవామలై; శరశతైర్విద్రాన్యవిద్రాన్యయో
లేభేసర్వవిశేషయుక్తనగరగ్రామం స్దరుద్రోనృప:"
అనియున్న తములైనట్టియు, ప్రఖ్యాతము లైనట్టియు, నశ్వరబుల నారోహించుట యందు నేర్పరియు, చారుపరాక్రముండు నగు దొమ్మ (దామనాయుడు, లేక దామరాజు) అనువానిని పార్ధుడు కర్ణుని వందలకొలది తీక్ష్ణణములైన బాణములచేత బలుమాఱు తఱుమగొట్టినట్లుగా రుద్రదేవుడు తఱిమి విశేషవస్తు సంపన్నంబు లయిన పట్టణంబూను గైకొనియె నని చెప్పబడి యున్నది. ఇందు బేర్కొనబదిన రుద్రదేవుని శత్రు వెవ్వడో నిర్ధారించుటకు నాధారము గానిపింపకున్నది.
"ఈడ మెడవిడమ్బరభరక్షోదక్షము క్ష్మాభృతాం
దుర్వారోద్ధుర వీరమన్త్రసమయాదానైక దీక్షాగురుం
శ్రీమన్మేళగిదేవసజ్గ సమయప్రోద్భూతర్సాపహాం
ప్రాప్తశ్రీ పోలనాసదేశవిభవం శ్రీరుద్రదేవంసదా. "
ఈశ్లోఫ్కమునదు బేర్కొనబడిన రుద్రదేవుని ప్రతివీరులనుగూర్చిన చరిత్రవినర మెంతమాత్రము దెలియ్ గాకున్నది. కులోత్తుంగరాజెంద్రచక్రవర్తి కుమారుడును, క్రీ.శ. 1078 మొదలుకొని 1084 వఱకు, 1088-89 మొదలుకొని 1092-93 వఱకును, రాజప్రతినిధినుండి వేంగీదేశమును పరిపాలించిన వీరచోడభూపాలుని ముఖ్యసేనాధిపతిగ నున్న మేడమార్యుణీ పైశ్లోకముమునందు బేర్కొనబడిన మేడప్రభు వని నమ్మి యాంధ్రులరిత్రము లోని ప్రధమభాగమున "ఈమేడమార్యుడు కాకతీయాంధ్రప్రభు వైన మొదతి ప్రతాపరుద్రునితో యుద్ధముచేసి యోదిపోయినట్టు గన్పట్టుచున్న" దనివ్రాసియున్నాడనుగాని యీ మొదటిప్రతాపరుద్రుడూ క్రీ.శ. 1196